Begin typing your search above and press return to search.

చిరుతతో దిగిన ఫోటో షేర్ చేసిన హీరోయిన్.. నెట్టింట వైరల్!!

By:  Tupaki Desk   |   12 July 2020 1:30 AM GMT
చిరుతతో దిగిన ఫోటో షేర్ చేసిన హీరోయిన్.. నెట్టింట వైరల్!!
X
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్.. అంటే ఉత్తరాదితో పాటు దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎందుకంటే కరిష్మా బ్యూటీ గురించి దేశం మొత్తం తెలుసు. ఆమెను ఆరాధించే అభిమానులు ఇప్పటికి కోకొల్లలు. నాలుగు పదుల వయసు పై బడినా కూడా కరిష్మా.. 90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. కెరీర్ ప్రారంభం అయిన కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన కరిష్మా.. దాదాపు బాలీవుడ్ లోని స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తన అద్భుతమైన నటనతో.. అభిమానులకు విందు పంచే అందాలతో ఇండియాలో కరిష్మా క్రేజ్ మాములుది కాదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్.. హిట్స్ అందుకున్న కరిష్మా ఒకానొక సమయంలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా రికార్డు సృష్టించింది. మరో విషయం ఏంటంటే బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయింది.

స్టార్ నటిగా స్టార్డం పొందుతున్న టైంలోనే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటున్న కరిష్మా.. సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ చురుకుగానే ఉంటుంది. నలభై యేళ్ళ వయసులో కూడా బికినీ వేసుకొని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ ఏ మాటకు ఆ మాట కరిష్మా ఫిగర్.. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే మెయింటైన్ చేస్తుందంటే మాములు విషయం కాదు. ఈ విషయంలో ఆమెను అభినందించి తీరాలి. ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో చిరుత పులితో దిగిన ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. 2000లో గోవిందా హీరోగా షికారి సినిమా టైంలో దిగిన ఫోటో ఇది. జీప్ మీద ఒకవైపు నేను.. మరోవైపు చిరుత. మొదట్లో కాస్త భయం వేసింది. ఆ పిక్ దక్షిణాఫ్రికాలో షూటింగ్ టైములో దిగాను. భయం వేసింది కానీ ఆ క్షణాలు అలా ఉండిపోయాయి.. అంటూ చెప్పుకొచ్చింది కరిష్మా. నిజంగా అమ్మడి అందాన్ని చూసి ఆ చిరుత ఏమి అనలేదు కావచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.