Begin typing your search above and press return to search.

నరేష్ మారేడుమిల్లి.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే!

By:  Tupaki Desk   |   25 Nov 2022 12:30 AM GMT
నరేష్ మారేడుమిల్లి.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే!
X
టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ కామెడీ సినిమాలతోనే తన కెరీర్లో మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే పదేళ్ల క్రితం అతని కెరీర్ మరొక విధంగా ఉండేది. ముఖ్యంగా తండ్రి ఈవివి సత్యనారాయణ ఉన్నప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిన మళ్లీ వెంటనే ఆయన డైరెక్షన్లో సినిమా చేసి సక్సెస్ అందుకునేవారు. ఈవివి వారసుడిగా అల్లరి నరేష్ మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు. అయితే సుడిగాడు సినిమా తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.

ఆ సినిమాతో అప్పట్లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక తరువాత వరుస ఫ్లాప్స్ తో దాదాపు 8 ఏళ్ల పాటు సతమతమైన నరేష్ చివరగా 2020లో నాంది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా మరీ ఆశ్చర్యపరచే రేంజ్ లో సక్సెస్ కాలేదు కానీ ఓ మోస్తారుగా మంచి లాభాలు అయితే అందించింది.

అయితే ఇప్పుడు అతను మరొక డిఫరెంట్ కంటెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎలక్షన్స్ చట్టాల నేపథ్యంలో వస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాను నరేష్ మార్కెట్ కు తగ్గట్టుగా లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 390 కి పైగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 510 థియేటర్లలో విడుదలవుతోంది.


ఇక సినిమా సక్సెస్ టాక్ అందుకుంటేనే థియేటర్స్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టార్గెట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా 4 కోట్ల బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది.

అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 4.50 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. మరి నరేష్ నాంది తరహాలోనే ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.