Begin typing your search above and press return to search.

మాతృక బాటలోనే 'దృశ్యం 2'..?

By:  Tupaki Desk   |   26 Sep 2021 2:30 AM GMT
మాతృక బాటలోనే దృశ్యం 2..?
X
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ డ్రామా ''దృశ్యం 2''. మలయాళంలో సూపర్ హిట్ 'దృశ్యం 2' చిత్రానికి ఇది రీమేక్. 2014లో వచ్చిన 'దృశ్యం' సినిమాకి సీక్వెల్. వెంకీ నటించిన 'నారప్ప' సినిమా ఓటీటీలో విడుదలైన తరుణంలో ఈ రీమేక్ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని రోజుల క్రితం 'దృశ్యం 2' మేకర్స్ పునరాలోచనలో పడ్డారని.. థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లాలని చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'దృశ్యం' సీక్వెల్ ని ఓటీటీలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు అనుకున్నట్లు డిస్నీ హాట్ స్టార్ లో కాకుండా.. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే దసరా లేదా దీపావళి కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

నిజానికి అమెజాన్ ప్రైమ్ వారు 'నారప్ప' తో పాటుగా 'దృశ్యం 2' హక్కులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేసారట. ఆ డీల్ సెట్ అవకపోవడంతో నారప్ప చిత్రాన్ని మాత్రమే తీసుకున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు కంటెంట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన డిస్నీ హాట్ స్టార్ ఈ రీమేక్ సీక్వెల్ రైట్స్ కోసం సంప్రదింపులు జరిపారట. అయితే మేకర్స్ కోట్ చేసిన అధిక ధర వల్ల వెనక్కి తగ్గారట.

ఈ నేపథ్యంలో మళ్ళీ అమెజాన్ తోనే డీల్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'దృశ్యం 2' ఒరిజినల్ వెర్సన్ అమెజాన్ ప్రైమ్ లోనే డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయింది. ఈ క్రమంలో ఇప్పుడు రీమేక్ కూడా అదే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రాబోతోందని అంటున్నారు. మరి త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇకపోతే ''దృశ్యం 2'' సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేశారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. డి.సురేష్‌ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి దీనికి నిర్మాతలు.

'దృశ్యం' లో నటించిన నటీనటులు ఇందులోనూ కొనసాగుతున్నారు. వెంకటేష్ భార్యగా మీనా కనిపించనుంది. ఎస్తర్ అనీల్ - కృతికా - నదియా - నరేష్లతో పాటుగా సంపత్ నంది - పూర్ణ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.