Begin typing your search above and press return to search.

గులాబీ నేత అడ్డాలో బాల‌య్య వీరంగం

By:  Tupaki Desk   |   18 Feb 2022 8:31 AM GMT
గులాబీ నేత అడ్డాలో బాల‌య్య వీరంగం
X
బోయపాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన చిత్రం `అఖండ‌`. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం బాల‌య్య‌కు భారీ విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

విడుద‌లైన అన్ని చోట్లా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ ఉత్సాహంతో వున్న నంద‌మూరి బాల‌కృష్ణ అదే జోష్ తో మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే.

ఇది బాల‌కృష్ణ న‌టిస్తున్న 107వ చిత్రం. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈమూవీలో క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ .. బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ మూవీని లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. వేట‌పాలెం ప‌రిస‌రాల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో స‌రికొత్త మేకోవ‌ర్ తో ఇందులో క‌నిపించ‌బోతున్నారు.

రీసెంట్ గా `క్రాక్‌` మూవీని హైవోల్టేజ్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న గోపీచంద్ మ‌లినేని అదే పంథాని అనుస‌రిస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `క్రాక్‌`లో వేట‌పాలెం గ్యాంగ్ కి సంబంధించిన ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అదే వేటపాలెం బ్యాచ్ కి సంబంధించిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ శుక్రవారం గులాబీ నేత కేటీఆర్ అడ్డా సిరిసిల్లో మొద‌లైంది. ముందుగా బాల‌య్య పాల్గొన‌గా హై వోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్ ని చిత్రీక‌రిస్తున్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీక్వెన్స్ షూట్ జ‌రుగుతోంది. ఫైట్ సీన్ తో మూవీ స్టార్ట్ చేయ‌డంతో బాల‌య్య వీరంగం మొద‌లైంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో జ‌య‌మ్మ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తోంది.

`క్రాక్‌`లో జ‌య‌మ్మ‌గా ఆక‌ట్టుకున్న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ .. ఈ మూవీలోనూ అంత‌కు మించిన ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని తెలిసింది. క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ ఛాయాగ్ర‌హ‌ణం.. సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈమూవీ ఈ ఏడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.