Begin typing your search above and press return to search.

యాంకర్‌ జాన్సీకి పాజిటివ్‌ వార్తలపై క్లారిటీ

By:  Tupaki Desk   |   4 July 2020 9:50 AM GMT
యాంకర్‌ జాన్సీకి పాజిటివ్‌ వార్తలపై క్లారిటీ
X
బుల్లి తెర వర్గాల వారు పలువురు ఈమద్య కాలంలో మహమ్మారి వైరస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. నటుడు ప్రభాకర్‌.. నటి నవ్య స్వామి తో పాటు పలువురు బుల్లి తెరకు చెందిన వారికి పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని అంటున్నారు. తాజాగా యాంకర్‌ జాన్సీకి కూడా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని ప్రచారం జరిగింది. ఆమె నిర్వహించిన పరివార్‌ సీజన్‌ 2 షూటింగ్‌ సందర్బంగా పాజిటివ్‌ ఉన్న వారితో ఆమె కాంటాక్ట్‌ అవ్వడం వల్ల ఆమెకు కూడా పాజిటివ్‌ వచ్చిందనేది వార్తల సారాంశం.

తనకు వైరస్‌ పాజిటివ్‌ అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై జాన్సీ మండిపడినది. ఆమె సోషల్‌ మీడియా లైవ్‌ ద్వారా పుకార్లకు చెక్‌ పెట్టింది. ఇటీవల నవ్యకు పాజిటివ్‌ వచ్చిన వెంటనే చాలా మంది జాన్సీని ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టారట. పలువురు జాన్సీకి కాల్‌ చేశారట. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. గాసిప్స్‌ గురించి మాట్లాడేందుకు మాత్రం నాకు ఎవరు కాల్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.

వైరస్‌ కారణంగా తెలుగు బుల్లి తెరకు చెందిన నటీనటులు యాంకర్స్‌ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. షూటింగ్స్‌ జరుగుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ ధరించడం పీపీఈ కిట్స్‌ ను ధరించడం మంచిదంటూ జాన్సీ సూచించింది. మొత్తానికి తనకు మాత్రం వైరస్‌ లేదని క్లారిటీ ఇచ్చింది.