Begin typing your search above and press return to search.

ఆదికి మరెవ్వరు దొరకలేదా అంటున్నారు!

By:  Tupaki Desk   |   22 April 2021 1:30 AM GMT
ఆదికి మరెవ్వరు దొరకలేదా అంటున్నారు!
X
హీరోగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఆది సాకుమార్‌ సక్సెస్ పరంగా వెనుకబడి పోయాడు. ఇటీవల విడుదల అయిన శశి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సుదీర్ఘ కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడి పోయిన ఆది ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా ఏదో విధంగా ఆఫర్లు అయితే దక్కించుకుంటున్నాడు. ఈయన కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దర్శకుల ఎంపిక విషయంలో కూడా ఈయన ఆలోచిస్తున్నాడా లేదా అనే అనుమానం కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన దర్శకుడు వీరభద్రంతో కలిసి ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

వీరభద్రం కెరీర్‌ ఆరంభంలో ఒక మోస్తరు సక్సెస్ లతో గుర్తింపు దక్కించుకున్నాడు. కాని నాగార్జునతో తెరకెక్కించిన 'భాయ్‌' చిత్రం అతడి కెరీర్ ను వెనక్కు నెట్టేసింది. ఆ సినిమా ప్లాప్‌ తో వీరభద్రంకు అసలు ఆఫర్లు అనేవి కరువయ్యాయి. ఆ మద్య ఆదితో చుట్టాలబ్బాయి అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా మళ్లీ వీరిద్దరు కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు. హీరో ఆది తో వీరభద్రం సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి మరియు మన్మోహన్‌ రావులు నిర్మిస్తున్నారు.

గతంలో ప్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా చేయడం అంటే తెలివి తక్కువ నిర్ణయం అంటూ కొందరు ఆదిపై విమర్శలు చేస్తున్నారు. సక్సెస్ కోసం మంచి కథను మరియు దర్శకుడిని ఎంపిక చేసుకోవాల్సింది పోయి మళ్లీ వీరభద్రం వంటి ప్లాప్ డైరెక్టర్‌ ను ఎంపిక చేసుకున్న ఆది తీరును నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఎంతో మంది కొత్త వారు ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ ఉన్నారు. వారు కనిపించకుండా ఆదికి కేవలం వీరభద్రం మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆది ఏ నమ్మకంతో ఈ సినిమాకు కమిట్ అయ్యాడో మరి. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రాలను అందించడంలో వీరభద్రం దిట్ట అంటూ కెరీర్‌ ఆరంభంలో పేరు దక్కించుకున్నాడు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడేమో చూడాలి.