Begin typing your search above and press return to search.

మ‌రోసారి ఫిబ్ర‌వరినే నమ్ముకున్న యూత్ స్టార్..!

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:59 AM GMT
మ‌రోసారి ఫిబ్ర‌వరినే నమ్ముకున్న యూత్ స్టార్..!
X
యూత్ స్టార్ నితిన్ గతేడాది 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టి నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కరోనా లాక్ డౌన్ కారణంగా కలెక్షన్స్ కి గండి పడినప్పటికీ సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు 'భీష్మ' విడుదలైన ఫిబ్రవరి నెలలోనే నితిన్ లేటెస్ట్ మూవీ 'చెక్' విడుదల కానుంది. 2021 ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మేకర్స్ వెల్లడించారు.

క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ 'చెక్' తెరకెక్కింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. జైలు నేపథ్యంలో ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇన్నాళ్లూ ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ పద్దతిలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ 'చెక్' ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి రూమర్స్ కి చెక్ పెట్టింది. మరోసారి ఫిబ్రవరినే నమ్ముకున్న నితిన్ కి 'చెక్' మరో సూపర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.