Begin typing your search above and press return to search.

#అర్జున‌ఫ‌ల్గున‌.. చెడుపై మంచి ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది!

By:  Tupaki Desk   |   15 Oct 2021 7:22 AM GMT
#అర్జున‌ఫ‌ల్గున‌.. చెడుపై మంచి ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది!
X
యంగ్ హీరో శ్రీ విష్ణు భారీ స‌క్సెస్ లు అందుకోక‌పోయినా మినిమం గ్యారెంటీ స్టార్ గా దూసుకెళుతున్నాడు. హిట్టు లేక‌పోయినా న‌టుడిగా మంచి మార్కులు ప‌డుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు యంగ్ హీరోతో సినిమాలు చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు చేయ‌డానికి శ్రీ విష్ణు బెస్ట్ ఆప్ష‌న్ గా నిలుస్తున్నాడు. శ్రీవిష్ణుతో సినిమా అంటే కంఫ‌ర్ట్ జోన్ గాను నిర్మాత‌లు భావిస్తున్నారు. అన‌వ‌స‌ర హంగామా ఉండ‌దు. ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తాడు..ఎప్పుడూ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉంటాడు. మోహ‌మాటప‌రుడు వంటివి శ్రీవిష్ణు ప్రోఫెష‌న‌ల్ కెరీర్ ఎడిష‌న‌ల్ క్వాలిఫికేష‌న్స్ ప‌నికొస్తున్నాయి.

ఇటీవ‌లే ఈ యంగ్ హీరో `రాజ రాజ చోర` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చినా క‌రోనా సెకెండ్ వేవ్ భ‌యంగా కార‌ణంగా వ‌సూళ్లు ఆశించినంత‌గా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా మూడు..నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ఒక‌టి `అర్జున ఫ‌ల్గుణ‌`. ``చెడుపై మంచి ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది`` అనే థీమ్ లైన్ తో క‌థ సాగ‌నుంది. ఈ చిత్రానికి తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ద‌స‌రా సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ తో శుభాకాంక్ష‌లు తెలిపింది యూనిట్. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశంలో భాగంగా శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృతా అయ్యర్ శ‌త్రువుల నుంచి త‌ప్పించుకుని పారిపోతున్న లుక్ తో పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. పోస్ట‌ర్ ఇంప్రెసివ్ గా డిజైన్ చేశారని చెప్పాలి. ఇంత‌కీ శ్రీ‌విష్ణు మోస్తున్న గోనె సంచిలో ఏం ఉందో కానీ శత్రువుల‌ వేట తీవ్రంగానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

గ‌తంలో విడుద‌లైన స్టిల్స్ కూడా ఇంతే క్రియేటివ్ గా థీమ్ ని ఎలివేట్ చేస్తూ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఫెస్టివ‌ల్ మోడ్ పోస్ట‌ర్ తో ఈ యంగ్ హీరో మంచి మార్కులు కొట్టేసాడు. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి.. అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా మంచి టెక్నిషియ‌న్లు...బెస్ట్ ప్యాడింగ్ తోనూ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనూ కొద్ది రోజుల క్రిత‌మే బిజీ అయింది. కానీ క‌రోనా రాక‌తో ఆ ప‌నుల్ని వాయిదా వేసింది. మ‌ళ్లీ క‌రోనా త‌గ్గింది కాబ‌ట్టి ప‌నులు ద‌స‌రా నుంచి రీస్టార్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.