Begin typing your search above and press return to search.

తిరుపతిలోనే పెళ్లి.. ఆయనెప్పుడూ నా మైకంలోనే ఉండాలి: జాన్వీకపూర్

By:  Tupaki Desk   |   5 March 2021 2:30 PM GMT
తిరుపతిలోనే పెళ్లి.. ఆయనెప్పుడూ నా మైకంలోనే ఉండాలి: జాన్వీకపూర్
X
అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ గురించి సినీప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ధడక్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన జాన్వీ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ఇరవై మూడేళ్ల కుర్రభామ తన ఖాతాలో పెద్ద సినిమాలే కలిగిఉంది. గతేడాది 'గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. ప్రస్తుతం హారర్ కామెడీ రూహి అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. మార్చ్ 11న రూహి సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. జాన్వీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా గ్లామర్ ప్రియులకు జాన్వీ అంటే వీరాభిమానం. అందుకే ఆమెను సోషల్ మీడియాలో తెగఫాలో అవుతుంటారు.

అయితే ఎల్లప్పుడూ షూటింగ్స్ తో, ఫోటోషూట్ లతో బిజీగా ఉండే జాన్వీ.. ఆ మధ్య బ్రైడ్స్ టుడే అనే మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన పలు విషయాలను బయటపెట్టింది. ఆమె వివాహం చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం జాన్వీ ఏకాగ్రత మొత్తం సినిమాలపై ఉందని చెప్పింది. వివాహం భవిష్యత్తులో జరిగినా ఎలా ఉండాలని కోరుకుంటున్నారని అడిగినప్పుడు జాన్వీ ఇలా చెప్పుకొచ్చింది. 'నా వివాహం కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు సన్నిహితుల మధ్య జరుపుకుంటాను. ఎందుకంటే నాకు హంగులు ఆర్భాటాలు ఇష్టం ఉండదు. అలాగే నా పెళ్లి సాంప్రదాయబద్ధంగా పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో జరుపుకుంటాను.

ఆ రోజున నేను కంజీవరం చీర కట్టుకుంటాను. నాకు కాబోయేవాడు లుంగీ కట్టుకుంటాడు. ఇక నా పెళ్ళి భోజనంలో పూర్తిగా దక్షిణాది వంటకాలు ఉంటాయి. ఇడ్లి, సాంబార్, ఖీర్, పెరుగన్నం లాంటివి ఉంటాయని చెప్పింది. ఇక తన భర్త ఎలా ఉండాలో చెబుతూ.. 'అతను తెలివిగలవాడై ఉండాలి. అలాగే చేసే పనిలో నమ్మకం ఉండాలి. ముఖ్యంగా నన్నెప్పుడు ప్రేమించాలి. నవ్వించాలి. ముఖ్యంగా అతను నా మైకం లోనే ఉండాలని' చెబుతోంది అమ్మడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీ రూహి సినిమా విడుదల గురించి ఎదురుచూస్తోంది. అలాగే ఆమె చేతిలో దోస్తానా-2 ఉంది. చూడాలి మరి రూహితో హిట్ అందుకుంటుందేమో!