Begin typing your search above and press return to search.

యాత్ర-2 మొద‌ల‌య్యేది అప్పుడే..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 1:30 AM GMT
యాత్ర-2  మొద‌ల‌య్యేది అప్పుడే..!
X
దివంగ‌త మహానేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజకీయ జీవితం ఇతివృత్తంగా తెర‌కెక్కిన చిత్రం ‘యాత్ర‌’. వైఎస్ చేప‌ట్టిన పాదయాత్ర ప్రధాన ఘట్టంగా రూపొందిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలో వై.ఎస్‌.ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారు. వైఎస్ హావ‌భావాల‌ను అద్బుతంగా ప‌లికించారు.

ఈ చిత్రాన్ని గొప్ప‌గా మ‌లిచిన దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ. యాత్ర విజ‌యం త‌ర్వాత‌.. ఈ చిత్రానికి సీక్వెల్ తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడీ డైరెక్ట‌ర్‌. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా పార్ట్ 2 తెరకెక్కుతుందనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే.. ఈ సీక్వెల్ లో ఎవరు న‌టిస్తారు? అనే చ‌ర్చ జ‌రిగింది. చివ‌ర‌కు త‌మిళ స్టార్ సూర్య‌ను సంప్ర‌దించ‌గా.. ఓకే చెప్పేశాడు.

అయితే.. సూర్య ఓకే చెప్పిన‌ప్ప‌టికీ రెండో యాత్ర మాత్రం మొద‌లు కాలేదు. అన్నీ కుదిరిన‌ప్ప‌టికీ.. సినిమా ప్రారంభం ఎందుకు ఆల‌స్య‌మ‌వుతోందో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం ఈ సినిమా ప్ర‌స్తుతానికి వాయిదా వేసిన‌ట్లుగా తెలిసింది. డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ ప్రస్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ ను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో ఈ సినిమా ఉండ‌బోతోంది.

స్ట‌యిలిష్ స్టార్‌ అల్లు అర్జున్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట మ‌హి. అంతేకాదు.. ఈ క‌థ‌ను వారిద్ద‌రికీ వినిపించాడ‌ట‌. అయితే.. ఈ స్టోరీ వారిద్ద‌రికీ న‌చ్చింద‌ని స‌మాచారం. క‌థ న‌చ్చింది కాబ‌ట్టి.. వారిద్ద‌రే ఈ ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఈ లెక్క ప్ర‌కారం.. ఈ మ‌ల్టీస్టార‌ర్ పూర్త‌యిన త‌ర్వాత యాత్ర‌-2 తెర‌కెక్కే ఛాన్స్ క‌నిపిస్తోంది.