Begin typing your search above and press return to search.

RRR హీరోలిద్దరూ ఒకే బ్యూటీతో రొమాన్స్ చేయనున్నారా?

By:  Tupaki Desk   |   18 Jun 2021 3:30 PM GMT
RRR హీరోలిద్దరూ ఒకే బ్యూటీతో రొమాన్స్ చేయనున్నారా?
X

టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదలపై త్వరలోనే క్లారిటీ రానుంది. దీని తర్వాత తారక్ - చరణ్ నటించబోయే సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కొరటాల శివ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలు అనౌన్స్ చేస్తే.. దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ తో చెర్రీ కొత్త సినిమా ప్రకటించారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ హీరోలిద్దరూ ఇప్పుడు ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో తెరకెక్కే '#NTR30' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ చేతుల మీదుగా 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియరా.. ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. మరోవైపు శంకర్ - చరణ్ కాంబోలో రానున్న '#RC15' కోసం ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు కియరా అద్వానీ ని ఫైనలైజ్ చేశారట. చెర్రీ తో ఇంతకముందు 'వినయ విధేయ రామ' చిత్రంలో కియరా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి జత కట్టడానికి రెడీ అయిందని టాక్.

ఇలా 'ఆర్.ఆర్.ఆర్' హీరోలిద్దరూ 'ధోనీ' భామ కియరా అద్వానీతో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ స్కేల్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమాలు కావడం గమనార్హం. బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కియరా.. తారక్ - చరణ్ సినిమాలతో సౌత్ లోనూ సత్తా చాటే అవకాశం ఉంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ చిట్ చాట్ సెషన్ లో ముచ్చటించిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ కంబ్యాక్ అనౌన్సమెంట్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.