Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా...?

By:  Tupaki Desk   |   11 July 2020 4:00 PM GMT
ఎన్టీఆర్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు తారక్. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో ఓ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పటికే తారక్ కి స్టోరీ కూడా చెప్పారని సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు.

కాగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఆర్.ఆర్.ఆర్' మిగతా షూటింగ్ కంప్లీటై.. ఎన్టీఆర్ ఈ మూవీ నుండి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అంటే ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో రిలీజ్ అవుతుంది. ఇదంతా చూసుకుంటే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయమే పట్టేట్టు ఉంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ద్రుష్టి పెట్టనున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం 2022 దాకా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో పాల్గొనే అవకాశాలు తక్కువే. మరి ప్రశాంత్ నీల్ అప్పటి దాకా తారక్ కోసం వెయిట్ చేస్తాడా లేదా ఈ గ్యాప్ లో వేరే సినిమా చేసుకొని వస్తాడా అనేది చూడాలి. మొత్తం మీద ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ఇప్పట్లో రాదని స్పష్టంగా అర్థం అవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.