Begin typing your search above and press return to search.
కొండ కోనల్లో ట్రెక్కింగ్ కి ముందు బన్ని ఇలా!
By: Tupaki Desk | 6 July 2020 3:45 AM GMTబన్ని తదుపరి పుష్ప చిత్రీకరణకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారీ లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్లు వాయిదా వేసినా.. ఇకపై ఉపేక్షించక చిత్రీకరణ ప్రారంభించాలని సుకుమార్ రంగం సంసిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే గోదావరి పరిసరాల్లోని మారేడుమిల్లి (ప.గో.జిల్లా) సమీపంలో ఓ అడవిని గిరిజన గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ రోడ్లు చదును చేసి షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక్కడ బన్నిపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందిట.
అయితే అడవులు కొండ కోనల్లో షూటింగులు అంటే అక్కడికి సరైన వెహికల్ ఫెసిలిటీ ఉండదు. కాలి నడకన కొంతదూరం లోనికి చేరుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ స్పాట్స్ డీప్ ఫారెస్టులోకి వెళ్లాల్సి ఉంటే చాలా కఠినం గానే ఉంటుంది. అక్టోబర్ నుండి పుష్ప రెగ్యులర్ షూట్ ను ప్రారంభించనున్నారట. అందువల్ల చిత్రబృందం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాల్సి ఉంటుంది. అందుకు బన్ని చాలా ముందస్తుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టారు.
ఈ ఆదివారం వేకువ ఝామున అల్లు అర్జున్ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జాగింగ్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలం లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదంతా రోజువారీ కార్డియో వ్యాయామాలు చేయడం లో భాగమే. లాక్ డౌన్ కి ముందు బన్ని జిమ్ కి వెళ్లడమో లేక అతని ఇంటి వద్ద వర్కౌట్స్ చేయడమో కుదిరేది. కానీ ఇప్పుడు అతను కార్డియో చేయడానికి కేబీఆర్ పార్క్ వెలుపల జాగింగ్ ట్రాక్ ఉపయోగిస్తున్నాడు. ఇటీవల క్రమం తప్పకుండా ఈ ట్రాక్ లో జాగింగ్ చేస్తున్నాడట. పుష్ప చిత్రీకరణ లో భాగంగా కొండ కోనల్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కాలినడకన చేయవలసి ఉంది. దీంతో క్రమం తప్పక కేబీఆర్ పార్క్ కి వెళుతున్నాడట. తనతో పాటు భార్య స్నేహా రెడ్డి కూడా జాగింగ్ కి వెళుతున్నారు.
అయితే అడవులు కొండ కోనల్లో షూటింగులు అంటే అక్కడికి సరైన వెహికల్ ఫెసిలిటీ ఉండదు. కాలి నడకన కొంతదూరం లోనికి చేరుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ స్పాట్స్ డీప్ ఫారెస్టులోకి వెళ్లాల్సి ఉంటే చాలా కఠినం గానే ఉంటుంది. అక్టోబర్ నుండి పుష్ప రెగ్యులర్ షూట్ ను ప్రారంభించనున్నారట. అందువల్ల చిత్రబృందం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాల్సి ఉంటుంది. అందుకు బన్ని చాలా ముందస్తుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టారు.
ఈ ఆదివారం వేకువ ఝామున అల్లు అర్జున్ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జాగింగ్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలం లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదంతా రోజువారీ కార్డియో వ్యాయామాలు చేయడం లో భాగమే. లాక్ డౌన్ కి ముందు బన్ని జిమ్ కి వెళ్లడమో లేక అతని ఇంటి వద్ద వర్కౌట్స్ చేయడమో కుదిరేది. కానీ ఇప్పుడు అతను కార్డియో చేయడానికి కేబీఆర్ పార్క్ వెలుపల జాగింగ్ ట్రాక్ ఉపయోగిస్తున్నాడు. ఇటీవల క్రమం తప్పకుండా ఈ ట్రాక్ లో జాగింగ్ చేస్తున్నాడట. పుష్ప చిత్రీకరణ లో భాగంగా కొండ కోనల్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కాలినడకన చేయవలసి ఉంది. దీంతో క్రమం తప్పక కేబీఆర్ పార్క్ కి వెళుతున్నాడట. తనతో పాటు భార్య స్నేహా రెడ్డి కూడా జాగింగ్ కి వెళుతున్నారు.