Begin typing your search above and press return to search.
గుసగుస: హీరోయిన్ల సొమ్ములు అడవి పాలు!
By: Tupaki Desk | 20 Oct 2020 4:45 AM GMTఅందాల కథానాయికల్లో చాలామంది భారీ పారితోషికాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా వచ్చిన సొమ్ముల్ని సదరు కథానాయికలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అంటే.. తమకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన కళామతల్లికే అంకితం చేయాలనుకునేవాళ్లు కొందరున్నారు.
రకుల్ ప్రీత్ లా తెలివిగా జిమ్ వ్యాపారంలో పెట్టేవాళ్లు.. అనుష్కలా రియల్ ఎస్టేట్ లో పెట్టేవాళ్లు కాస్త తక్కువే. చాలామంది రియల్ వెంచర్లలో పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చినా కొందరు మాత్రం సినిమా వ్యామోహంతో ఇక్కడ నిర్మాతలుగా ఎదిగేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం ఇటీవల ఫిలింనగర్ లో చర్చకు వచ్చింది.
కొందరిని నమ్మి హీరోయిన్లు తమ సంపాదనను వారి చేతుల్లో పోస్తుంటే.. సదరు వ్యక్తులు కం పెద్దమనుషులు ఆ మొత్తాలతో సినిమాలు తీస్తామని నమ్మించి మోసం చేస్తున్నారట. దీనిపై పలువురు హీరోయిన్లు లబోదిబోమనడం తాజాగా చర్చకు వస్తోంది. దాదాపు 3-4 కోట్ల మేర బడ్జెట్ అవుతుందని చెప్పి.. అందులోంచి కేవలం కోటిన్నర ఖర్చు చేసి సినిమాని మమ అనిపించేస్తున్న బాపతు మీడియేటర్లు ఉన్నారట. అయితే ఇలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలిసినవాళ్లు. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇక హీరోయిన్ల పేరుతో సంపాదించుకనే నీచం సరికాదని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగుల మాయా ప్రపంచంలో ఇవన్నీ నిత్యం జరిగేవే అయినా మరీ దిగజారుడు సరికాదన్న వాదనా వినిపిస్తోంది.
రకుల్ ప్రీత్ లా తెలివిగా జిమ్ వ్యాపారంలో పెట్టేవాళ్లు.. అనుష్కలా రియల్ ఎస్టేట్ లో పెట్టేవాళ్లు కాస్త తక్కువే. చాలామంది రియల్ వెంచర్లలో పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చినా కొందరు మాత్రం సినిమా వ్యామోహంతో ఇక్కడ నిర్మాతలుగా ఎదిగేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం ఇటీవల ఫిలింనగర్ లో చర్చకు వచ్చింది.
కొందరిని నమ్మి హీరోయిన్లు తమ సంపాదనను వారి చేతుల్లో పోస్తుంటే.. సదరు వ్యక్తులు కం పెద్దమనుషులు ఆ మొత్తాలతో సినిమాలు తీస్తామని నమ్మించి మోసం చేస్తున్నారట. దీనిపై పలువురు హీరోయిన్లు లబోదిబోమనడం తాజాగా చర్చకు వస్తోంది. దాదాపు 3-4 కోట్ల మేర బడ్జెట్ అవుతుందని చెప్పి.. అందులోంచి కేవలం కోటిన్నర ఖర్చు చేసి సినిమాని మమ అనిపించేస్తున్న బాపతు మీడియేటర్లు ఉన్నారట. అయితే ఇలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలిసినవాళ్లు. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇక హీరోయిన్ల పేరుతో సంపాదించుకనే నీచం సరికాదని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగుల మాయా ప్రపంచంలో ఇవన్నీ నిత్యం జరిగేవే అయినా మరీ దిగజారుడు సరికాదన్న వాదనా వినిపిస్తోంది.