Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ ప‌ర్సులో ఏముంది?

By:  Tupaki Desk   |   20 Jan 2022 6:14 AM GMT
బుట్ట‌బొమ్మ ప‌ర్సులో ఏముంది?
X
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బుట్ట‌బొమ్మ‌గా ముద్ర వేసుకుంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోయిన్ గా స‌త్తా చాటుతూ న‌య‌న‌తార కు మించి రెమ్యున‌రేషన్ అందుకుంటున్నటాప్ హీరోయిన్ గా రికార్డుని సృష్టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ బుట్ట‌బొమ్మ ముంబై వీధుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తూ క‌నిపించింది.

ముంబైలో రెడ్ క‌ల‌ర్ టాప్‌, స్కిన్ టైట్ లెగ్గిన్ ధ‌రించి... బ్లాక్ గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తూ సంద‌డి చేసింది. చేతిలో ఆపిల్ ఫోన్‌, ఓ బ్లాక్ వాలెట్‌తో పాటు రెడ్ క‌ల‌ర్ బుల్లి ప‌ర్స్ తో ఫేస్ కు ఎలాంటి మాస్క్ క‌నిపించింది. దీంతో బుట్ట బొమ్మ‌ని నెటిజ‌న్ లు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. పూజా చేతిలో వున్న స్మాల్ ప‌ర్స్ ని చూసిన ఓ నెటిజ‌న్ `నేను ఇప్పుడే ఆ ప‌ర్సులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంత‌కీ ఆ బుల్లి ప‌ర్సులో ఏముంది? అని పూజ ని కామెంట్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.

మరో నెటిజ‌న్ `ఆప్ కె ప‌ర్స్ మే క్యాహే ? అంటూ ఆట‌ప‌ట్టించ‌డం మొద‌లుపెట్టాడు. కానీ పూజా హెగ్డే నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో పూజా హెగ్డే ప‌ర్స్ లో ఏముంద‌న్న‌ది నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల పూజా హెగ్డే త‌న త్రోబ్యాక్ బికినీ పిక్స్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసి ఇన్ స్టాని హీటెక్కించింది. మాల్దీవ్స్ కు గ‌తంలో వెళ్లిన పూజా హెగ్డే అక్క‌డ టూ పీస్ బికినీ ధ‌రించి స‌న్ బాత్ ని ఎంజాయ్ చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంది కూడా. తిరిగి అదే ఫొటోల‌ని తాజాగా పోస్ట్ చేసి మ‌రోసారి అభిమానుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ కామెంట్ ల వ‌ర్షం కురిపించారు. మీరే ఒక సూర్య ర‌శ్మీ..ఇంత‌కీ మిమ్మ‌ల్ని కెమెరాలో బంధించిన ఆ అదృష్ట‌వంతుడైన కెమెరామెన్ ఎవ‌రు? అంటూ పూజ‌ని ట్రోల్ చేయ‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే న‌టించిన `రాధేశ్యామ్‌` ఈ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కావాల్సింది. కానీ దేశ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు.

మా వంతు బెస్ట్ ని మీకివ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్‌, కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో మా చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ ల‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాం. `రాధేశ్యామ్‌` ప్రేమ వ‌ర్సెస్ విధి నేప‌థ్యంలో రూపొందింది. ఈ ట‌ఫ్ టైమ్ లో మీ ప్రేమ మాకు స‌హ‌క‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో ఈ సినిమాని చూద్దాం` అని మేక‌ర్స్ వెల్ల‌డించారు.