Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ తో వార్ ద‌ర్శ‌కుడు.. తెలుగు బ్యాన‌ర్ అడ్వాన్స్!?

By:  Tupaki Desk   |   18 April 2021 4:32 AM GMT
ప్ర‌భాస్ తో వార్ ద‌ర్శ‌కుడు.. తెలుగు బ్యాన‌ర్ అడ్వాన్స్!?
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌లార్- ఆదిపురుష్ చిత్రాల కోసం ప్ర‌భాస్ అటూ ఇటూ షిఫ్ట‌వుతున్నారు. రెండు సినిమాలను ఒకేసారి శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇదిలా ఉండ‌గానే మేలో నాగ్ అశ్విన్ తో సినిమాని ప్రారంభించాల‌ని క‌సిగా ఉన్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

ఇంత‌లోనే ప్ర‌భాస్ కి ఖైదీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌థ చెప్పి లాక్ చేశాడ‌ని వేరొక క‌థ‌నం వేడెక్కించింది. ప‌నిలోప‌నిగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేసందుకు ప్ర‌భాస్ ఆస‌క్తిగా ఉన్నాడ‌ని ఇప్ప‌టికే లైన్ ఓకే అయ్యింద‌ని క‌థ‌నాలొచ్చాయి. వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ ని ప్ర‌భాస్ ని క‌లిపి ఓ సినిమా చేస్తార‌ని అది వార్ సీక్వెల్ కావొచ్చ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అయితే అది నిజం కాద‌ని తాజాగా టాలీవుడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వార్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్ర‌భాస్ సినిమా చేస్తున్న మాట నిజం. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేక‌ర్స్ పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేష‌న్ చిత్రానికి స‌ప‌రేట్ స్క్రిప్ట్ రెడీ అవుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే మైత్రి సంస్థ సోలోగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తుందా లేక బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుందా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.