Begin typing your search above and press return to search.

'రియా ఎక్కడ దాక్కుందో తెలుసు.. కానీ నేను చెప్పను'

By:  Tupaki Desk   |   5 Aug 2020 2:30 AM GMT
రియా ఎక్కడ దాక్కుందో తెలుసు.. కానీ నేను చెప్పను
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ మరణించిన ఇన్ని రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు పాట్నాలో రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణం వెనుక రియా చక్రవర్తి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. సుశాంత్‌ ఆత్మహత్యకు సరిగ్గా 6 రోజుల ముందు ఫ్లాట్ ఖాళీ చేసి తన కుమారుడికి సంబంధించిన నగదు, ఆభరణాలు, ల్యాప్‌ టాప్‌, క్రెడిట్‌ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీహార్ పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణ నిమిత్తం బీహార్ బృందం ముంబైకి చేరుకుంది.

ఇదిలా ఉండగా బీహార్ లో తనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినప్పటి నుండి రియా చక్రవర్తి తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రియా ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్ మ్యాన్ మాట్లాడుతూ రియా చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి అర్థరాత్రి ఎక్కడికో వెళ్లారని చెప్పాడు. ఆ సమయంలో వారితో పాటు చాలా లగేజ్ కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి రియా ఎవరితో టచ్ లోకి రాలేదు. అదే సమయంలో తన లాయర్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. తనకు దేవుడిపైన న్యాయవ్యవస్థ పైనా నమ్మకం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందని మాట్లాడింది.

ఈ నేపథ్యంలో సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. రియా చక్రవర్తి ఎక్కడ దాక్కుందో తనకు తెలుసని.. కానీ ఎక్కడుందో రివీల్ చేయనని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పాట్నా పోలీసులు కూడా ఆమెను చేరుకోలేరని.. ఎందుకంటే దర్యాప్తు చేయడానికి వచ్చిన సీనియర్ ఆఫీసర్ ముంబైలో ఇప్పటికే క్వారంటైన్ అయ్యారని.. మిగతా సభ్యులను కూడా క్వారంటైన్ చేయడానికి చూస్తున్నారని.. అందుకే ఈ కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేస్తేనే న్యాయం జరుగుతుందని కోరుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక బీహార్ ప్రభుత్వం సుశాంత్ సూసైడ్ కేసుని సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.