Begin typing your search above and press return to search.

సమంత ఓకే అంటేనే.. నాగచైతన్యతో ఆ డైరెక్టర్ సినిమా ఉంటుందట..!

By:  Tupaki Desk   |   29 Jun 2020 3:30 PM GMT
సమంత ఓకే అంటేనే.. నాగచైతన్యతో ఆ డైరెక్టర్ సినిమా ఉంటుందట..!
X
అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే మాత్రం.. నాగచైతన్య అనే చెప్పాలి. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతుకి జోడిగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒకటి, అలాగే గతంలో మనం వంటి అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తో సినిమా ఓకే చేశాడట. ఇక తాజాగా విక్రమ్ కె.కుమార్ తో చేయబోయే సినిమాకు 'థాంక్ యూ' అనే సింపుల్ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. విక్రమ్ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటి టైటిల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట విక్రమ్. కరోనా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. మధ్యలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందట. అదేంటంటే.. డైరెక్టర్ పరశురామ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మహేష్ కంటే ముందు నాగచైతన్యకి ఓ స్క్రిప్ట్ వినిపించాడు పరశురామ్. ఇక మహేష్ ఓకే చేయడంతో చైతుతో మూవీ ఆగిపోయింది. ప్రస్తుతం ఆగిపోయిన స్క్రిప్ట్ సెట్ప్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించాడట చైతూ. పరశురామ్ కథకు విక్రమ్ కుమార్ డైరెక్షన్ చేయాలనీ సంప్రదిస్తే.. ఓ షరతు పెట్టాడట విక్రమ్. నేను ఈ సినిమా చేయాలంటే సమంతను హీరోయిన్ గా పెట్టాలని సూచించాడట. అందుకు నాగచైతన్య కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ మూవీ తెరమీదకి రావాలంటే సమంత ఒక్కరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇక అన్నీ కుదిరితే మళ్లీ చైతూ - సామ్ లను తెరపై చూడొచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.