Begin typing your search above and press return to search.

విజయ్ తో బ్యూటీఫుల్ హీరోయిన్స్.. నైట్ పార్టీ!

By:  Tupaki Desk   |   25 May 2022 11:49 AM GMT
విజయ్ తో బ్యూటీఫుల్ హీరోయిన్స్.. నైట్ పార్టీ!
X
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని డైరెక్ట్ గా ముంబై కి వెళ్ళాడు. అక్కడ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినటువంటి లైగర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఆ పనుల గురించి చర్చలు జరిపేందుకు విజయ్ దేవరకొండ వెళ్లాల్సి వచ్చింది. వచ్చే రాగానే మొదటి రోజు ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా పార్టీ చేసుకున్నారు.

అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ అలాగే చిత్ర సహనిర్మాత ఛార్మి తో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా ఆ పార్టీలో చేరడం విశేషం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ కు కూడా ఇదే మొదటి సినిమా కావడంతో తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని అభిమానుల్లో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకొని ఆగస్ట్ నెలలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే లైగర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల శివ నిర్మాణ దర్శకత్వంలో అఖిల్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరిగింది. ఆ పనులు పూర్తి కాగానే వెంటనే లైగర్ టీమ్ ను కలిశాడు. మంగళవారం సాయంత్రం ఛార్మి అనన్య పాండే విజయ్ దేవరకొండ ముగ్గురు కలిసి ఒక నైట్ క్లబ్ లో పార్టీ చేసుకున్నారు. ఇక వారు తిరిగివస్తుండగా బాలీవుడ్ మీడియా ఫోకస్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నే జనగణమన అనే మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.