Begin typing your search above and press return to search.

'వరుడు కావలెను' సెన్సార్ పూర్తి..!

By:  Tupaki Desk   |   21 Oct 2021 6:21 AM GMT
వరుడు కావలెను సెన్సార్ పూర్తి..!
X
యువ కథానాయకుడు నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ''వరుడు కావలెను''. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ''వరుడు కావలెను'' చిత్రానికి సెన్సార్ బోర్డు వారు 'U/A' (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేసినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగశౌర్య కు సంబంధించి ఓ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. ఈరోజు గురువారం సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

'వరుడు కావలెను' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇది లవ్ - కామెడీ - ఎమోషన్స్ కలబోసిన అందమైన కుటుంబ కథా చిత్రమని.. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ - ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. గణేష్ రావూరి ఈ సినిమాకు మాటలు రాశారు.

ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - ప్రవీణ్ - అనంత్ - కిరీటి దామరాజు - ‘రంగస్థలం’ మహేష్ - అర్జున్ కళ్యాణ్ - వైష్ణవి చైతన్య - సిద్దిక్ష తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గతేడాది ప్రారంభంలో 'అశ్వద్ధామ' సినిమాతో అలరించిన నాగశౌర్య కు ''వరుడు కావలెను'' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.