Begin typing your search above and press return to search.

మూడో భర్తను ఆ నటి తన్ని తరిమేసిందా?

By:  Tupaki Desk   |   19 Oct 2020 2:00 PM GMT
మూడో భర్తను ఆ నటి తన్ని తరిమేసిందా?
X
కరోనా లాక్ డౌన్ వేళ ప్రముఖ నటి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ఇంతటి వైరస్ వ్యాప్తిలో జాగ్రత్తలు పాటించకుండా చేసుకున్న ఆమె మూడో పెళ్లిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహ బంధాలు నిలబడక ఆ నటి మూడో పెళ్లి చేసుకుంది.

సీనియర్ నటులు మంజులు-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ రెండో పెళ్లి కూడా పెటాకులు కావడంతో మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ అనే గత జూన్ లో మూడో పెళ్లి చేసుకుంది.. పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని అప్పుడు చెప్పుకొచ్చింది. ఇక అతడితోనే జీవితం అంటూ ఓ పెద్ద స్టేట్ మెంటే ఇచ్చింది.

వివాహం చేసుకున్న వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు.

దీనిపై పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు వనితపై దుమ్మెత్తిపోశారు. అయినా వాటికి వనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఇటీవల గోవా ట్రిప్ లో మద్యం తాగి పీటర్ కొట్టాడని టాక్.

చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి గెంటేసిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి చర్చించుకుంటున్నారట..

అయితే ఈ వార్తలపై వనిత విజయ్ కుమార్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ మాత్రం ‘ఇల్లీగల్ మ్యారేజ్ కు వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్నదే జరిగిందంటూ’ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది.