Begin typing your search above and press return to search.
ఇప్పటికీ ఆ నిర్మాతని వదలని బొమ్మాళీ!
By: Tupaki Desk | 26 Sep 2020 5:31 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం `మహారథి` రిజల్ట్ గురించి విధితమే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. `చంద్రముఖి` ఫేమ్ పి. వాసు దర్శకత్వంలో వాకాడ అప్పారావు ఈ చిత్రాన్నినిర్మించారు. మీరాజాస్మిన్- జయప్రద కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. పోటీపడి మరీ బాలయ్య డేట్స్ ని సొంతం చేసుకుని తన స్థాయికి మించి వాకాడ అప్పారావు ఈ చిత్రానికి ఖర్చు చేసి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని అప్పట్లో కథనాలొచ్చాయి.
భారీ స్థాయిలో నష్టాల్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా తరువాత నిర్మాతగా వాకాడ అప్పారావు మరో సినిమా చేయలేదు. ఇండస్ట్రీలోనే వున్నా సినిమాలకు దూరంగానే వుంటూ వస్తున్నారు. ఇన్నేళ్లుగా `మహారథి` నష్టాలని పే చేస్తూనే వున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. సూపర్ గుడ్ ఫిలింస్ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన `మహారథి`తో ఓవర్ నైట్ లో ఆ పేరుని పోగొట్టుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
కొంత మంది ఫైనాన్షియర్స్ సహకారంతో సినిమా ప్రారంభించానని.. బ్యాంకు నుంచి 4 కోట్లు అప్పు తీసుకున్నానని అయితే ఈ హడావిడితో తాను కథపై దృష్టిపెట్టలేదని దాంతో సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన నష్టాలని చెల్లిస్తూనే వున్నానని వాపోయారు.
భారీ స్థాయిలో నష్టాల్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా తరువాత నిర్మాతగా వాకాడ అప్పారావు మరో సినిమా చేయలేదు. ఇండస్ట్రీలోనే వున్నా సినిమాలకు దూరంగానే వుంటూ వస్తున్నారు. ఇన్నేళ్లుగా `మహారథి` నష్టాలని పే చేస్తూనే వున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. సూపర్ గుడ్ ఫిలింస్ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన `మహారథి`తో ఓవర్ నైట్ లో ఆ పేరుని పోగొట్టుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
కొంత మంది ఫైనాన్షియర్స్ సహకారంతో సినిమా ప్రారంభించానని.. బ్యాంకు నుంచి 4 కోట్లు అప్పు తీసుకున్నానని అయితే ఈ హడావిడితో తాను కథపై దృష్టిపెట్టలేదని దాంతో సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన నష్టాలని చెల్లిస్తూనే వున్నానని వాపోయారు.