Begin typing your search above and press return to search.
సంక్రాంతి బరిలో ప్రభాస్?
By: Tupaki Desk | 23 Jan 2023 6:00 PM GMTప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా క్రేజ్ తెచ్చుకున్న ఆయన... ఆ తర్వాత మాత్రం ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. ప్రభాస్ చేసిన సాహో సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేదు కానీ... హిందీ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించింది. ఆ తర్వాత ఆయన చేసిన రాదేశ్యాం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ నుంచి వస్తున్న ప్రాజెక్టుల మీద భారీ అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా భారీ బడ్జెట్ సినిమాలను ఎంచుకోకుండా ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తయింది.
కానీ ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారనే విషయం మీద అధికారిక ప్రకటన గాని.. అసలు సినిమా ప్రారంభించిన విషయం కానీ... ఇప్పటివరకు ఎందుకు మేకర్స్ పంచుకోలేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తిరిగి ఎక్కుతున్న పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్ సంస్థ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వారికి పోటీ ఇచ్చే విధంగా దిల్ రాజు కూడా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది . ఒకరకంగా చూసుకుంటే పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న పుష్ప 2 అలాగే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాతో పాటు ప్రభాస్ సినిమా పోటీ పడుతూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నిజంగానే ఈ మూడు సినిమాలు పోటీ పడతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ నుంచి వస్తున్న ప్రాజెక్టుల మీద భారీ అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా భారీ బడ్జెట్ సినిమాలను ఎంచుకోకుండా ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తయింది.
కానీ ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారనే విషయం మీద అధికారిక ప్రకటన గాని.. అసలు సినిమా ప్రారంభించిన విషయం కానీ... ఇప్పటివరకు ఎందుకు మేకర్స్ పంచుకోలేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తిరిగి ఎక్కుతున్న పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్ సంస్థ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వారికి పోటీ ఇచ్చే విధంగా దిల్ రాజు కూడా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది . ఒకరకంగా చూసుకుంటే పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న పుష్ప 2 అలాగే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాతో పాటు ప్రభాస్ సినిమా పోటీ పడుతూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నిజంగానే ఈ మూడు సినిమాలు పోటీ పడతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.