Begin typing your search above and press return to search.

అల్లరోడి మారేడుమిల్లి ట్రిప్‌ డేట్‌ ఫిక్స్‌

By:  Tupaki Desk   |   29 Sep 2022 7:20 AM GMT
అల్లరోడి మారేడుమిల్లి ట్రిప్‌ డేట్‌ ఫిక్స్‌
X
అల్లరి నరేష్‌ కామెడీ సినిమాల నుండి సీరియస్‌ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నాందితో అల్లరి నరేష్ కొత్త ప్రయాణం మొదలు అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అదే తరహా లో మరిన్ని సినిమాలు చేయాలని.. కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి అల్లరి నరేష్ వచ్చాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఇటీవలే అల్లరి నరేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం అనే సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నట్లుగా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఈ సినిమాకు ఏఆర్‌ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన ఈ సినిమా అప్పుడే విడుదలకు సిద్ధం అయ్యింది. విడుదల తేదీ కూడా ప్రకటించారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ను నవంబర్‌ 11వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్‌ ని కూడా విడుదల చేయడం జరిగింది. చాలా స్పీడ్‌ గా షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లరి నరేష్ కు జోడీగా ఆనంది హీరోయిన్‌ గా నటించింది. ప్రవీణ్ సంపత్‌ రాజ్ లు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు. ఈ సినిమాతో అల్లరి నరేష్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.