Begin typing your search above and press return to search.

నటి శ్రీసుధ అవినీతి ఆరోపణల కేసులో ట్విస్ట్

By:  Tupaki Desk   |   1 Aug 2020 11:30 PM GMT
నటి శ్రీసుధ అవినీతి ఆరోపణల కేసులో ట్విస్ట్
X
ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ పై సినీ నటి సాయి సుధ.. చేసిన అవినీతి ఆరోపణల కేసులో పురోగతి కనిపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏసీబీ అధికారులు నటికి, ఇన్ స్పెక్టర్ మధ్యలో ఉన్న మధ్యవర్తులను విచారిస్తున్నారు.

తాజాగా ఈ కేసులో బాపూనగర్ లో ఉండే రాజేష్ నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు. ఇదే కేసులో మరో ప్రముఖ మధ్యవర్తిని కూడా విచారించినట్టు తెలిసింది.

ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నటి సాయి సుధ ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఎస్ఆర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మురళీకృష్ణ తన వద్ద లంచం తీసుకున్నట్లు సాయి సుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇన్ స్పెక్టర్ లంచం కేసులో ఏసీబీ విచారిస్తోంది.