Begin typing your search above and press return to search.
రూ. 5 కోట్లతో మహేష్ కోసం త్రివిక్రమ్..!
By: Tupaki Desk | 24 Sep 2021 5:30 PM GMTఒకప్పుడు సినిమాల సెట్టింగ్స్ అంటే లక్షల్లో ఉండేవి. కొన్ని సినిమాల్లో అసలు సెట్టింగ్స్ అనేవి కనిపించేవి కాదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా సెట్టింగ్స్ ఉండేవి కాదు. కాని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు కూడా కోట్ల రూపాయలతో సెట్టింగ్ లను కలిగి ఉంటున్నాయి. సినిమాల్లో రిచ్ నెస్ కోసం భారీగా సెట్టింగ్స్ ను వేయిస్తున్నారు. విదేశాలకు చెందిన లొకేషన్స్ ను కూడా హైదరాబాద్ లో రీ క్రియేట్ చేస్తున్న రోజులు ఇవి. స్టార్ హీరోల సినిమాల్లో ఏదైనా ప్రదేశం లేదా ప్రాంతం ఎక్కువ సమయం కనిపిస్తుంది అంటే కోట్ల రూపాయలతో వాటిని నిర్మించేందుకు సిద్దం అవుతారు. బాహుబలి సినిమా కోసం జక్కన్న మహిష్మతి సాంమ్రాజ్యంనే క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వచ్చిన.. వస్తున్న సినిమాల్లో అంతకు మించి ఖర్చు చేస్తున్న మేకర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబు తో తెరకెక్కించబోతున్న సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఏకంగా అయిదు కోట్లతో సెట్టింగ్ ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
సినిమాలో మెజార్టీ పార్ట్ ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుందట. ఆ షూటింగ్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం రూ.5 కోట్లు ఖర్చు చేసి మరీ సెట్టింగ్ వేయిస్తున్నాడట. ఆ సెట్టింగ్ అద్బుతంగా వస్తుందంటూ యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ అక్కడే ప్రారంభం అవుతుందని.. హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న ఆ సెట్టింగ్ కోసం ప్రముఖ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సినిమా యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. తమన్ ఈ సినిమాకు స్వరాలను అందించబోతున్నాడని తెలుస్తోంది.
అల వైకుంఠపురంలో వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్ కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు.. త్రివిక్రమ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు మంచి ఫలితాన్ని సాధించాయి. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచాయి. అందుకే ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అతడే పార్థు అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా దసరాకు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
సినిమాలో మెజార్టీ పార్ట్ ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుందట. ఆ షూటింగ్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం రూ.5 కోట్లు ఖర్చు చేసి మరీ సెట్టింగ్ వేయిస్తున్నాడట. ఆ సెట్టింగ్ అద్బుతంగా వస్తుందంటూ యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ అక్కడే ప్రారంభం అవుతుందని.. హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న ఆ సెట్టింగ్ కోసం ప్రముఖ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సినిమా యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. తమన్ ఈ సినిమాకు స్వరాలను అందించబోతున్నాడని తెలుస్తోంది.
అల వైకుంఠపురంలో వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్ కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు.. త్రివిక్రమ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు మంచి ఫలితాన్ని సాధించాయి. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచాయి. అందుకే ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అతడే పార్థు అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా దసరాకు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు.