Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు..?

By:  Tupaki Desk   |   2 April 2020 2:30 AM GMT
పాన్ ఇండియా మూవీ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శశకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత తారక్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటెర్టైమెంట్స్ రాధాకృష్ణ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇంతకముందు వీరి కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా వచ్చి విజయం సాధించింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తాజా చిత్రం వచ్చే ఏడాది విడుదల సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్టీఆర్ పక్కన రొమాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ని అనుకుంటున్నారట. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాలి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు కూడా సత్తాచాటిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమెను తెలుగులో నటింపజేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఆఫర్స్ ఆమె వద్దకు వెళ్లినా జాన్వీ తిరస్కరించింది. కాగా, త్రివిక్రమ్ ఈ చిత్రంలో జాన్వీని నటింపజేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారట. ఎన్టీఆర్ మూవీ పాన్ ఇండియాగా విడుదల చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ గా జాన్వీ అయితే మంచి అడ్వాంటేజ్ అవుతుందని ఆలోచిస్తున్నాడట. జాన్వీ కూడా ఎప్పటి నుండో తెలుగు లో చేయడానికి రెడీ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన అంటే ఆమె భారీ ఆఫర్ దక్కించుకున్నట్లే. కాకపోతే ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిన జాన్వీ ఈ మూవీ కొరకు డేట్స్ అడ్జస్ట్ చేయగలదా లేదా అనే సందేహం ఉందట. ఇదే కనుక నిజమై జాన్వీ ఎన్టీఆర్ సినిమా లో నటించినట్లైతే అభిమానులకు పండగనే చెప్పుకోవచ్చు.