Begin typing your search above and press return to search.

పొట్టి నిక్కరుతో టిక్ టాక్ లో రెచ్చిపోయిన త్రిష

By:  Tupaki Desk   |   3 April 2020 5:50 AM GMT
పొట్టి నిక్కరుతో టిక్ టాక్ లో రెచ్చిపోయిన త్రిష
X
కరోనా మహమ్మారి రోజు రోజుకి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతోంది. కరోనా భయంతో మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న మన స్టార్ హీరోయిన్లు తమ టాలెంటును బయటకు తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గ ఉండే హీరోయిన్లలో త్రిష ఒకరు. ఈ లాక్‌డౌన్ పిరియడ్‌లో ఏం చేయాలో తోచని పరిస్థితి నుండి బయట పడటానికి త్రిషా అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గృహ నిర్బంధాన్ని మరిచి పోయేందుకు ఈ భామ టిక్ టాక్ ను ఆశ్రయించినట్లుంది. పొట్టి నిక్కరు ధరించిన త్రిష వయ్యారంగా డ్యాన్స్ చేస్తూ తొలి ప్రవేశం తోనే ఇరగ దీసింది. ఆ తర్వాత తన వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసింది.

టిక్‌టాక్‌లోకి ప్రవేశించిన త్రిషా అత్యంత ప్రేక్షకదారణ పొందిన సింగర్ మేగన్ థీ స్టాలియన్ పాడిన సావేజ్‌‌పై స్టెప్పులు వేసింది. పొట్టి నిక్కరుతో చేసిన డ్యాన్స్ హాట్ హాట్‌గా మారింది. ఇక టిక్‌టాక్‌లో త్రిషను ఆపేది ఎవరు అనే విధంగా ఫోజులిచ్చింది. కరోనా వైరస్‌ భయాన్ని పరుగులు పెట్టించేలా ఇలా కనిపించింది. ఈ మధ్య రానా అల్లు అర్జున్ లతో వీడియో చాటింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా త్రిష ప్రస్తుతం మణిరత్నం రూపొందించే పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే ఆమె నటించిన పారపాధమ్ విలయట్టు - గర్జనాని - రాంగీ - షుగర్ - రామ్ లాంటి చిత్రాలు రిలీజ్‌ కు సిద్దంగా ఉన్నాయి. కాగా, ఇటీవల చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి ఈ భామ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.