Begin typing your search above and press return to search.
మరో మంచి 'ఆహా' అనిపించే మూవీ స్ట్రీమింగ్ కు రెడీ
By: Tupaki Desk | 19 Jan 2022 5:30 AM GMTత్రిష టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంది. ఆమె స్టార్ హీరోయిన్ గానే ఇంకా తెలుగు ప్రేక్షకుల దృష్టి లో ఉంది. ఈమద్య కాలంలో తెలుగు లో సినిమాలు చేయకున్నా కూడా ఆమె ఇతర భాషల్లో నటిస్తున్న సినిమా లు డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. తమిళం మరియు తెలుగు లో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కంటిన్యూ చేసిన త్రిష మలయాళంలో మాత్రం సినిమా చేయలేదు. ఆమె మలయాళ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి అందుకు సంబంధించిన కథ మరియు దర్శకుడు సెట్ అవ్వలేదు. ఎట్టకేలకు 2018 లో ఈ అమ్మడు మొదటి మలయాళ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హే జూడ్ అనే టైటిల్ తో ఈ అమ్మడు తన మొదటి మలయాళ మూవీని చేసి అలరించింది.
2018 ఫిబ్రవరిలో విడుదల అయిన హే జూడ్ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయాలని మేకర్స్ భావించారు. కాని రీమేక్ కు అనుకూల వాతావరణం వారికి కనిపించలేదు. దాంతో ఇప్పుడు హే జూడ్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్దం అయ్యింది. ఈమద్య కాలంలో పలు క్లాసిక్ మలయాళ సినిమా లను ఆహా ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ను కూడా ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హే జూడ్ సినిమా ను ఆహా లో ఈనెల 21న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు.
త్రిష ఈ సినిమా లో మలయాళ హీరో నివిన్ పౌల్ నటించాడు. ఈ సినిమాకు శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ కొచ్చి లో ప్రారంభం అయ్యి గోవాలో సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఆహా టీమ్ ఈ సినిమా ను డబ్ చేసి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు. త్రిష అంటే తెలుగు లో ఇంకా కూడా మంచి గుర్తింపు ఉంది. కనుక ఈ సినిమా కు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది.
ఆహా లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా కు మరింత గా పబ్లిసిటీ దక్కి ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆహా లో ఈమద్య కాలంలో మలయాళం నుండి తీసుకు వచ్చి డబ్ చేసి స్ట్రీమింగ్ చేసిన సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులతో ఆహా అనిపించడం ఖాయం అంటూ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
2018 ఫిబ్రవరిలో విడుదల అయిన హే జూడ్ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయాలని మేకర్స్ భావించారు. కాని రీమేక్ కు అనుకూల వాతావరణం వారికి కనిపించలేదు. దాంతో ఇప్పుడు హే జూడ్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్దం అయ్యింది. ఈమద్య కాలంలో పలు క్లాసిక్ మలయాళ సినిమా లను ఆహా ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ను కూడా ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హే జూడ్ సినిమా ను ఆహా లో ఈనెల 21న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు.
త్రిష ఈ సినిమా లో మలయాళ హీరో నివిన్ పౌల్ నటించాడు. ఈ సినిమాకు శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ కొచ్చి లో ప్రారంభం అయ్యి గోవాలో సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఆహా టీమ్ ఈ సినిమా ను డబ్ చేసి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు. త్రిష అంటే తెలుగు లో ఇంకా కూడా మంచి గుర్తింపు ఉంది. కనుక ఈ సినిమా కు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది.
ఆహా లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా కు మరింత గా పబ్లిసిటీ దక్కి ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆహా లో ఈమద్య కాలంలో మలయాళం నుండి తీసుకు వచ్చి డబ్ చేసి స్ట్రీమింగ్ చేసిన సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులతో ఆహా అనిపించడం ఖాయం అంటూ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.