Begin typing your search above and press return to search.

నెట్టింట దిల్ రాజుని ట్రెండ్ చేస్తున్నారా..ఆడుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:12 AM GMT
నెట్టింట దిల్ రాజుని ట్రెండ్ చేస్తున్నారా..ఆడుకుంటున్నారా?
X
స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు సంద‌ర్భం ఏదైనా స‌రే వార్త‌ల్లో నిలుస్తున్నారు. టాలీవుడ్ షూటింగ్ ల బంద్ అన్నా ఆయ‌న పేరే ప్ర‌ధానంగా వినిపించింది. ఆ త‌రువాత సినిమాల‌ షూటింగ్ లు బంద్ అన్న ఆయ‌నే తను త‌మిళ హీరో విజ‌య్ తో చేస్తున్న పినిమా షూటింగ్ ని ఆప‌కుండా కంటిన్యూ చేస్తూ మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. అదేమంటే అది తెలుగు సినిమా కాదు.. త‌మిళ సినిమా కాబ‌ట్టే షూటింగ్ చేస్తున్నాం అంటూ లాకిక్ లు చెప్పి మ‌రీ టాలీవుడ్ లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు.

దీంతో ప్రొడ్యూస‌ర్స్ చాలా మంది షూటింగ్ లు టాలీవుడ్ సినిమాలే కాదు. టాలీవుడ్ నిర్మాత‌లు నిర్మించే సినిమాల‌న్నీ ఆపాల్సిందే అంటూ కామెంట్ లు చేశారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే తాజాగా స్టార్ ప‌స్రొడ్యూస‌ర్ దిల్ రాజు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అయితే ఆయ‌న‌ని వార్త‌ల్లో నిలిచేలా చేసింది మాత్రం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్.

దిల్ రాజు ప్ర‌స్తుతం ఇత‌ర ప్రాజెక్ట్ లు చేస్తూనే త‌న బ్యాన‌ర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ ల‌తో RC15 ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని స‌మ‌కాలీన రాజకీయాంశాల‌పై సెటైరిక‌ల్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. పీరియ‌డిక్ ట‌చ్ తో పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ని ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఆపేసి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2` కోసం వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే.

ఆ కార‌ణంగా రామ్ చ‌ర‌ణ్ మూవీ ఆల‌స్యం అయ్యే ప్ర‌మాదం వుంద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో RC15 కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వ‌మ‌ని మెగా అభిమానులు ట్విట్ట‌ర్ వేదిక‌గా దిల్ రాజుని డిమాండ్ చేస్తుండ‌టం వైర‌ల్ గా మారింది. `వేక‌ప్ దిల్ రాజు`అనే హ్యాష్ ట్యాగ్ తో దిల్ రాజుని మెగా ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 35 వేల‌కు పైగా ట్వీట్ లు చేయ‌డంతో దిల్ రాజు సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ లో వైర‌ల్ గా మారారు.

దీంతో చాలా మంది దిల్ రాజుని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారా? లేక ఆడుకుంటున్నారా? అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా RC15 ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఆగ‌స్టు షెడ్యూల్ ని పూర్తి చేసిన శంక‌ర్ సెప్టెంబ‌ర్ నుంచి RC15ని ప‌క్కన పెట్టి `ఇండియ‌న్ 2` ప‌నుల్లో బిజీ కాబోతున్నారు. ఇదే మెగా ఫ్యాన్స్ ని ఇబ్బందికి గురిచేస్తోందట‌.

ఇదిలా వుంటే `ఇండియ‌న్ 2` కోసం క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టికే యుఎస్ వెళ్లారు. అక్క‌డ త‌న లుక్ టెస్ట్ చేసుకుంటున్నారు. పూర్తిగా సిద్ధ‌మైన త‌రువాత ఫ‌ర్ ఫెక్ట్ లుక్ లోకి వ‌చ్చాక క‌మ‌ల్ తిరిగి ఇండియా రానున్నారు. వ‌చ్చిన వెంట‌నే అంటే సెప్టెంబ‌ర్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే చ‌ర‌ణ్ ఆ స‌మ‌యంలో ఇత‌ర స్క్రిప్ట్ లు విన‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. శంక‌ర్ మూవీ త‌రువాత చ‌ర‌ణ్ .. `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.