Begin typing your search above and press return to search.

టాప్ 10 సౌత్ హీరోయిన్స్ విద్యార్హ‌త‌లు

By:  Tupaki Desk   |   18 Jun 2021 12:30 AM GMT
టాప్ 10 సౌత్ హీరోయిన్స్ విద్యార్హ‌త‌లు
X
త‌మ‌దైన అందం నట ప్ర‌తిభ‌తో సుదీర్ఘ కాలం సినీరంగంలో క‌థానాయిక‌లుగా రాణించిన భామలు ఎంద‌రో. కొంద‌రు పెళ్లి త‌రవాతా క‌థానాయిక‌లుగా రాణిస్తున్నారు. అయితే ఈ భామ‌ల విద్యార్హ‌త‌లు ఏమిటి? అన్న‌ది చాలామందికి తెలియ‌దు. ప‌లువురు క‌థానాయిక‌లు డిగ్రీలు పూర్తి చేశాకే సినీరంగంలో కెరీర్ ని ఎంచుకున్నారు.

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతున్న సమంత అక్కినేని బి.కామ్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ చెన్నై బ్యూటీకి కామ‌ర్స్ లో మంచి గ్రిప్ ఉంది. ఇటీవ‌ల సామ్ న‌టించిన `ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2` అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి శాకుంత‌లం అనే చిత్రంలో న‌టిస్తోంది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది.

బెంగ‌ళూరు బ్యూటీ అనుష్క శెట్టి మోడ‌లింగ్ నుంచి సినీరంగంలోకి వ‌చ్చి స్థిర‌ప‌డింది. కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అగ్ర క‌థానాయికగా 15ఏళ్లు పైగా ప‌రిశ్ర‌మ‌ను ఏలిన అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటిది కానుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ద‌శాబ్ధంన్న‌ర పైగానే టాలీవుడ్ కోలీవుడ్ లో చ‌క్రం తిప్పుతున్న తమన్నా భాటియా డ్రామా అండ్ ఆర్ట్స్ (బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్)లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. జాతీయ ఉత్త‌మ న‌టి ప్రియమణికి సైకాలజీలో బిఎ డిగ్రీ ఉంది. ప్రియ‌మ‌ణి ఫ్యామిలీమ్యాన్ సిరీస్ లో కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే.

అందాల చంద‌మామ కాజల్ అగర్వాల్ అడ్వర్ టైజింగ్ అండ్ మార్కెటింగ్ లో బిఎంఎం చేసింది. ఇటీవ‌లే గౌత‌మ్ కిచ్లు అనే ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ని పెళ్లాడి అత‌డి బిజినెస్ కి కూడా కాజ‌ల్ పెద్ద సాయం చేస్తోంది. క‌థానాయికగానూ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది.

వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో గోల్డెన్ లెగ్ అన్న పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కామ‌ర్స్ లో పీజీ పూర్తి చేసింది. మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో డిగ్రీ పూర్త‌యింది. పూజా ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌హా బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. కోలీవుడ్ లో ద‌ళ‌ప‌తి స‌ర‌స‌నా న‌టిస్తోంది. ఇటీవ‌లే క‌థానాయిక‌గా గ్రేట్ కంబ్యాక్ తో అద‌ర‌గొట్టిన శ్రుతిహాస‌న్ సైకాల‌జీలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌నా రంగంలో వెల‌గాల‌ని పెద్ద పాప్ సింగ‌ర్ అవ్వాల‌ని క‌ల‌లుగంది.

మ‌రో ముంబై బ్యూటీ కియ‌రా అద్వాణీ ముంబై కేద‌డ్రాల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్ లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి జైహింద్ కాలేజ్ లో మాస్ క‌మ్యూనికేష‌న్ లో పీజీ పూర్తి చేసింది. మాళ‌విక శ‌ర్మ క్రిమినాల‌జీ డిగ్రీ పూర్తి చేసి ప్ర‌స్తుతం న్యాయ‌శాస్త్ర విద్య‌ను పూర్తి చేసింది. లాయ‌ర్ గా ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది.