Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఫీవర్.... లాండ్ అవుతున్న బాలీవుడ్.. ..?

By:  Tupaki Desk   |   3 Dec 2021 9:30 AM GMT
టాలీవుడ్ ఫీవర్.... లాండ్ అవుతున్న బాలీవుడ్.. ..?
X
బాలీవుడ్ బిగ్ ఇండస్ట్రీ. బీ టౌన్ అంటే అదో వండర్ లా చూస్తారు అంతా. అయితే ఇపుడు సీన్ మారుతోంది. పాన్ ఇండియా మూవీస్ అరడజన్ కి పైగా టాలీవుడ్ లోనే తయారు అవుతున్నాయి. అవి కూడా టోటల్ గా బాలీవుడ్ లెక్కలు మార్చేసేలా ఉండబోతున్నాయి. మొదటి నుంచి చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ కి గట్టి పోటీ ఇస్తూనే ఉంది. బడ్జెట్ విషయంలో కానీ సక్సెస్ విషయంలో కానీ బాలీవుడ్ ఎపుడూ టాలీవుడ్ తోనే పోటీ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్పాన్ ఒక్కసారిగా పెరిగింది. అది బాలీవుడ్ ని దాటి ఖండాంతరాలకు వ్యాపిస్తోంది.

బాహుబలి వన్, టూ మూవీస్ రెండూ కూడా చేసిన రీసౌండ్ తో మొత్తం భారతీయ సినిమా బిజినెస్ లెక్కలు మారిపోయాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే అది ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది. ఆకాశమే హద్దుగా కలెక్షన్ల వర్షం కురిపించేస్తుంది అని ప్రూవ్ అయిపోయింది. ఇక బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం పరాజయాల‌ బాటలో ఉంటే టాలీవుడ్ నుంచి వెళ్ళిన ప్రభాస్ సాహో అంటూ ఏకంగా 150 కోట్ల కలెక్షన్లు ఫ్లాప్ సినిమాకు తెచ్చేశాడు. దానికి ముందు బాహుబలితో ప్రభాస్ బీ టౌన్ కి సరైన సవాల్ చేశాడు.

ఇక ఇపుడు ట్రిపుల్ ఆర్, రాధేశ్యాం వంటి మూవీస్ రెడీగా ఉన్నాయి. వీటి తరువాత ప్రభాస్ సలార్ కానీ రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కానీ, ప్రభాస్ అశ్వనీదత్, నాగ అశ్విన్ కాంబో కానీ బాలీవుడ్ కి మించే రేంజిలోనే ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ టూ తో పాటు, ఎన్టీయార్, చరణ్ లతో చేసే సినిమాలు చూసుకున్న టాలీవుడ్ మూడవ పాదం మోపేది బీ టౌన్ మీదనే అన్న సత్యం అర్ధమైపోతోంది.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ సీరియస్ గానే ఆలోచిస్తోంది. టాలీవుడ్ ని ఇక ఏ మాత్రం ఇగ్నోర్ చేయడానికి వీలులేదని కూడా భావిస్తోంది. అందుకే టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీస్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు అక్కడి హీరోలు. దానికి ముందు తమ మార్కెట్ ని పెంచుకోవడం కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో కలసి గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించడం అంటున్నారు. ఈ న్యూస్ వింటేనే షేకింగ్ గా ఉంది.

అయితే ఇలాంటి కాంబోలు మరిన్ని ఫ్యూచర్ లో చూస్తారని అంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సైరా మూవీతో మెగాస్టార్ తో కలసి నటించారు. ప్రభాస్ తో కూడా మరో పాన్ ఇండియా మూవీలో కనిపించబోతున్నారు. ఇక మరింతమంది బాలీవుడ్ సూపర్ స్టార్లు టాలీవుడ్ మేకర్స్ తో కలసి పాన్ ఇండియా లెవెల్ మూవీస్ చేయడానికి తెలుగు హీరోలతో వెండి తెరను పంచుకోవడానికి సిద్ధపడుతున్నారని టాక్. ఇక సౌతిండియాలోనే చూసుకుంటే కన్నడ, మళయాళ, తమిళ పరిశ్రమ హీరోలు టాలీవుడ్ మేకర్స్ తో ఇప్పటికే కలసి పనిచేశారు. ఇపుడు బాలీవుడ్ ఏకంగా దిగి వస్తోంది. చూడాలి ఈ కాంబోలు టాలీవుడ్ ని ఏ రేంజికి తీసుకెళ్తాయో. ఆ వైభవం ఎలా ఉంటుందో మరి.