Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్: షారుఖ్-సంజూ భాయ్ లతో నమ్రత..!

By:  Tupaki Desk   |   1 July 2022 5:30 AM GMT
త్రోబ్యాక్: షారుఖ్-సంజూ భాయ్ లతో నమ్రత..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఆమె.. 2000 లో 'వంశీ' సినిమాలో మహేశ్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ చేసిన ఈ జంట.. 2005లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్ గా పిలవబడుతున్నారు మహేష్ - నమ్రత. వీరి అన్యోన్యమైన దాంపత్యాన్ని గుర్తుగా గౌతమ్ - సితార వంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ ను పెళ్ళాడిన తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారనే సంగతి తెలిసిందే. తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి కేటాయించింది.

మహేష్ బాబుకు సంబంధించిన ఇతర అన్ని వ్యవహారాలు చూసుకునే నమ్రత.. ఓ వైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు వ్యాపార భాద్యతలు చూసుకుంటూ బిజీగా గడుపుతోంది. జీఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమాలు కూడా నిర్మిస్తోంది.

ఇక నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. దీని ద్వారా మహేష్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ - పిల్లల గురించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలానే ఫ్యామిలీ ఫోటోలను.. వెకేషన్స్ కు వెళ్ళిన సమయంలో గడిపిన సరదా క్షణాలను షేర్ చేస్తుంటుంది.

ఇటీవలే తన భర్త పిల్లలతో కలిసి హాలిడే కోసం న్యూయార్క్ వెళ్లిన నమ్రత.. ఎప్పటికప్పుడు అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తోంది. ఈ క్రమంలో త్రోబ్యాక్ థర్స్ డే అంటూ కొన్ని ఓల్డ్ మెమరబుల్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరియు అతని భార్య, ప్రముఖ నిర్మాత-డిజైనర్ గౌరీ ఖాన్ - నటి సంగీత బిజ్లానీ లతో కలసి నమ్రత ఒక ఫొటోలో పోజ్ ఇచ్చింది. మరో ఫోటోలో సంజయ్ దత్ - హీరో అనన్య పాండే తండ్రి చుంకీ పాండే మరియు మరికొంత మందితో స్నేహితులతో కలిసి కనిపిస్తోంది.

"మేమంతా మెక్సికో క్రూయిజ్ లైనర్‌ లో కలుసుకున్నాము!!! ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైమ్. గౌరీ నువ్వు ఇతర ఫొటోలలో మిస్ అవుతున్నావు.. నా చేతికి లభించిన అదృష్టం! జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నారు" అని నమ్రత కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన గౌరీ ఖాన్ వండర్ ఫుల్ మెమొరీస్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసింది.