Begin typing your search above and press return to search.

లూసీఫర్‌ పుకార్లే పుకార్లు ఇప్పుడు మరోటి

By:  Tupaki Desk   |   14 July 2020 6:30 AM GMT
లూసీఫర్‌ పుకార్లే పుకార్లు ఇప్పుడు మరోటి
X
మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసీఫర్‌ ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సాహో దర్శకుడు సుజీత్‌ ఆ రీమేక్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడు అనేది దాదాపుగా కన్ఫర్మ్‌ వార్త. అయితే రీమేక్‌ గురించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో కీలకమైన మరో హీరో పాత్రను విజయ్‌ దేవరకొండతో చేయించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇటీవలే విజయ్‌ దేవరకొండ టీం ఆ వార్తలను కొట్టి పారేసింది.

లూసీఫర్‌ లో కీలక పాత్రలో నటించిన మంజు వారియర్‌ పాత్రను సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన ఖుష్బు లేదా సుహాసినిలతో చేయించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కాని ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ లేకుండానే మరో పుకారు సినీ వర్గాల్లో పుకారు చేస్తోంది. సినిమాలోని విలన్‌ పాత్ర గురించి ఈసారి సరికొత్త పుకారు షికారు చేస్తోంది.

ఒరిజినల్‌ వర్షన్‌ లో విలన్‌ పాత్రను వివేక్‌ ఒబేరాయ్‌ పోషించాడు. ఆ పాత్రతో సినిమాకు వివేక్‌ మరింత బలం చేకూర్చాడు. దాంతో రీమేక్‌ వర్షన్‌ లో కూడా ఆయన్నే నటింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మేకర్స్‌ మొదట భావించారని కాని బడ్జెట్‌ ఇతరత్ర విషయాల కారణంగా ఆ పాత్రకు సౌత్‌ స్టార్‌ నటుడు అయిన రహమాన్‌ ను సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌ పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు నటీనటులు ఎవరు ఎలా ఉంటారో ఏ సినిమాలతో బిజీగా ఉంటారో చెప్పలేని పరిస్థితి.

ఆచార్య పూర్తి అయితే తప్ప లూసీఫర్‌ రీమేక్‌ ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి నుండే నటీనటుల ఎంపిక చేయడం టెక్నికల్‌ గా సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కనుక దర్శకుడు సుజీత్‌ పూర్తిగా స్క్రిప్ట్‌ మరియు స్క్రీన్‌ ప్లే విషయంలో చర్చలు జరుపుతూ ఉండవచ్చు కాని ఖచ్చితంగా నటీనటులను అప్పుడే ఫైనల్‌ చేసి ఉండక పోవచ్చు అంటున్నారు. షూటింగ్‌ నెల రోజులు ఉందనగా నటీనటుల విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు అంటున్నారు.