Begin typing your search above and press return to search.

రంగమార్తాండ నుండి ఎట్టకేలకు అప్‌ డేట్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:10 AM GMT
రంగమార్తాండ నుండి ఎట్టకేలకు అప్‌ డేట్‌ వచ్చింది
X
రియేటివ్‌ డైరెక్టర్‌ గా మంచి పేరు దక్కించుకున్న కృష్ణ వంశీ గత కొన్నాళ్లుగా తన క్రియేటివిటీని పక్కకు పెట్టి సినిమాను తీస్తున్నాడా అన్నట్లుగా ఆయన సినిమాలు ఉంటున్నాయి. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ సక్సెస్‌ అనేది లేకుండా కెరీర్‌ ను నెట్టుకు వస్తున్నాడు. ఈమద్య కాలంలో సినిమాల సంఖ్యను కూడా చాలా తగ్గించాడు. ఒకప్పుడు మంచి సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ మళ్లీ తన ఫామ్‌ లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన రంగమార్తాండ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రకాష్‌ రాజ్‌.. రాహుల్‌ సిప్లిగంజ్‌.. బ్రహ్మానందం.. శివాత్మిక.. రమ్యకృష్ణ.. అనసూయ ఇంకా పలువురు ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి కాని సినిమా ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ ఇవ్వలేదు. సినిమా రంగం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

అనసూయతో పాటు రమ్యకృష్ణ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. ప్రకాష్‌ రాజ్‌ లీడ్ రోల్‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 80 శాతం పూర్తి చేశామని త్వరలోనే పూర్తి చేస్తామంటూ తాజాగా కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ఆమద్య సినిమా ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. కాని సినిమా దాదాపుగా పూర్తి అయ్యిందని దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో వచ్చే ఏడాదిలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.