Begin typing your search above and press return to search.

అవన్నీ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   9 May 2021 6:57 AM GMT
అవన్నీ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్‌
X
వరుస సక్సెస్‌ లతో జోరు మీదున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 2 సీక్వెల్ ఎఫ్‌ 3 ని తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా ఎఫ్‌ 3 సినిమా కు బ్రేక్‌ వచ్చింది. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్‌ 3 సినిమా తర్వాత అనీల్ రావిపూడి చేయబోతున్న సినిమా విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాని గత కొన్నాళ్లుగా ఈయన బాలకృష్ణతో ఒక సినిమాను.. మహేష్‌ బాబుతో రెండవ సినిమాను.. రవితేజ తో చేసిన రాజా ది గ్రేట్‌ సినిమాకు సీక్వెల్‌ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఒక్క దర్శకుడు ఇన్ని సినిమాల వార్తలు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ముగ్గురు స్టార్‌ హీరోలతో అనీల్‌ రావిపూడి సినిమాలు చేయబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ మూడు సినిమాల్లో ఒకటి రెండు పుకార్లే అయ్యి ఉంటాయని ఇన్ని రోజులు కొందరు అనుకుంటూ వస్తున్నారు. వారి అనుమానంకు చెక్‌ పెడుతూ దర్శకుడు అనీల్‌ రావిపూడి అన్ని సినిమాలు చేయబోతున్నట్లుగా పేర్కొన్ని ఆ పుకార్లన్నీ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ మూడు ప్రాజెక్ట్‌ ల గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

బాలకృష్ణ గారితో సినిమా కు స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. ఒక విభిన్నమైన జోనర్‌ లో ఆ సినిమా సాగుతుంది. అయితే అంతా అనుకుంటున్నట్లుగా అది మల్టీ స్టారర్‌ గా ప్లాన్‌ చేయడం లేదు. మహేష్‌ సర్‌ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు సమయంలోనే ఆయనతో సినిమా గురించి చర్చలు జరిగాయి. స్టోరీ కూడా ఓకే అయ్యింది. త్రివిక్రమ్ గారి మూవీ ముందుకు రావడం వల్ల మా మూవీ కాస్త ఆలస్యం అవ్వబోతుంది. ఇక రవితేజతో నేను చేసిన రాజా ది గ్రేట్‌ సినిమా కు సీక్వెల్‌ చేసే ఆలోచన ఉంది. ఇంకా దానిపై చర్చలు మొదలు పెట్టలేదని పేర్కొన్నాడు. మొత్తానికి మూడు సినిమాలు ఉన్నాయని అనీల్ రావిపూడి పేర్కొన్నాడు. ఎఫ్‌ 3 తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ ఇస్తానంటూ దర్శకుడు స్పష్టం చేశాడు.