Begin typing your search above and press return to search.

తెలుగు ప్రేక్షకులకు నాది బాగా నచ్చిందిః శృతిహాస‌న్

By:  Tupaki Desk   |   21 April 2021 11:30 AM GMT
తెలుగు ప్రేక్షకులకు నాది బాగా నచ్చిందిః శృతిహాస‌న్
X
అప్ప‌టి వ‌ర‌కూ వ‌రుస వైఫ‌ల్యాల‌తో కొన‌సాగిన‌ శృతిహాస‌న్ ద‌శ‌.. గ‌బ్బ‌ర్ సింగ్ తో మారిపోయింది. ఆ చిత్రం బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. స్టార్ స్టేట‌స్ వ‌చ్చేందీ బ్యూటీకి. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయింది. సుమారు ద‌శాబ్ద కాలంపాటు టాప్ స్టార్ గా కొన‌సాగుతోంది. అయితే.. ఈ అమ్మ‌డికి ఒక వెలితి ఉంది.

అదే డ‌బ్బింగ్‌. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అందులోని గొంతు ఆమెది కాదు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కూ డ‌బ్బింగ్ చెప్ప‌లేదు శృతిహాస‌న్‌. ఇత‌రుల‌తోనే నెట్టుకొచ్చింది. అయితే.. సినిమాను పూర్తిగా ఆస్వాదించాలంటే.. సొంత గొంతు ఉండితీరాల్సిందే. అప్పుడే ఏ న‌టికి, న‌టుడికి అయినా.. త‌మ పాత్ర‌ను చూసిన‌ప్పుడు కిక్కొస్తుంది.

అయితే.. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ‘పిట్ట‌క‌థ‌లు’ సిరీస్ లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది శృతి. ఆమె గొంతుకు పాజిటివ్ రెస్పాన్సే వ‌చ్చింది. దీంతో.. రాబోయే త‌న సినిమాల‌కు సైతం డ‌బ్బింగ్ చెప్పాల‌ని ఆశ‌గా ఉంద‌ని చెబుతోంది శృతి.

‘‘పిట్ట కథలు సిరీస్ లో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. నా గొంతు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే.. భవిష్యత్ లో డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను’’ అని మనసులో మాట వెల్లడించిందీ బ్యూటీ.

కాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ రాణీగా కనిపించబోతోందీ అమ్మడు. ఈ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. మ‌రో వెబ్ సిరీస్ లోనూ న‌టిస్తోంది శృతి.