Begin typing your search above and press return to search.
రకుల్ ప్రీత్ కు తీరని కోరిక అదేనట!
By: Tupaki Desk | 19 Jun 2021 12:30 PM GMTటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. కొన్నాళ్లుగా సౌత్ లో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్లో జెండా పాతాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఛాన్సులతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బీ-టౌన్ లో మూడు సినిమాలు చేస్తోందీ బ్యూటీ. అద్దిరిపోయే బాడీ షేప్ తో అందానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే రకుల్ కు.. ఇప్పటి వరకూ బాలీవుడ్ లో అనుకున్న బ్రేక్ రాలేదనే చెప్పాలి.
అప్పుడెప్పుడో 2014లోనే బీటౌన్ కు పరిచయం అయ్యింది రకుల్. 'యారియన్' అనే చిత్రంతో హిందీలో అడుగుపెట్టింది. కానీ.. అది సక్సెస్ కాలేదు. దీంతో.. తిరిగి సౌత్ నే ఆశ్రయించింది. తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ స్టార్ డమ్ పెంచుకుంది. అయితే.. తన టార్గెట్ మాత్రం వదులుకోలేదు.
2019 లో మరోసారి బీటౌన్ పై దండయాత్ర చేసింది. 'ఐయారీ' అనే చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'దే దే ప్యార్ దే' 'మార్జావన్' వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. బాలీవుడ్ లో టిపికల్ నాచ్-గానా సినిమా చేయలేకపోయానని తెలిపింది. త్వరలో ఇలాంటి మూవీ చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పింది రకుల్.
ఇదిలాఉంటే.. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ లాంగ్వేజెస్ గురించిపట్టించుకోనని, అవకాశం ఉన్న ప్రతిచోటా సినిమా చేస్తానని చెప్పిందీ బ్యూటీ. నటులకు ఎలాంటి హద్దూలూ లేవని, వారు ఎక్కడికైనా వెళ్లగలరని చెప్పింది. ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ లో అటాక్, మేడే, థాంక్ గాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో వైష్ణవ్ తేజ్ తో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుంది.
అప్పుడెప్పుడో 2014లోనే బీటౌన్ కు పరిచయం అయ్యింది రకుల్. 'యారియన్' అనే చిత్రంతో హిందీలో అడుగుపెట్టింది. కానీ.. అది సక్సెస్ కాలేదు. దీంతో.. తిరిగి సౌత్ నే ఆశ్రయించింది. తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ స్టార్ డమ్ పెంచుకుంది. అయితే.. తన టార్గెట్ మాత్రం వదులుకోలేదు.
2019 లో మరోసారి బీటౌన్ పై దండయాత్ర చేసింది. 'ఐయారీ' అనే చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'దే దే ప్యార్ దే' 'మార్జావన్' వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. బాలీవుడ్ లో టిపికల్ నాచ్-గానా సినిమా చేయలేకపోయానని తెలిపింది. త్వరలో ఇలాంటి మూవీ చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పింది రకుల్.
ఇదిలాఉంటే.. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ లాంగ్వేజెస్ గురించిపట్టించుకోనని, అవకాశం ఉన్న ప్రతిచోటా సినిమా చేస్తానని చెప్పిందీ బ్యూటీ. నటులకు ఎలాంటి హద్దూలూ లేవని, వారు ఎక్కడికైనా వెళ్లగలరని చెప్పింది. ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ లో అటాక్, మేడే, థాంక్ గాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో వైష్ణవ్ తేజ్ తో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుంది.