Begin typing your search above and press return to search.

రాజు గారు అందుకే రిజెక్ట్ చేసారా ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:14 AM GMT
రాజు గారు అందుకే రిజెక్ట్ చేసారా ?
X
'శైలజా రెడ్డి అల్లుడు' తర్వాత కొంచెం టైం తీసుకొని సాయి ధరం తేజ్ తో 'ప్రతి రోజు పండగే' సినిమా చేసాడు మారుతి. సినిమా డిసెంబర్ 20 న థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ సినిమా కథను ముందుగా దిల్ రాజుకి చెప్పాడట మారుతి. నిన్న ట్రైలర్ లాంచ్ లో ఈ విషయాన్ని బయట పెట్టాడు. 'భలే భలే మగాడివోయ్' తర్వాత నుండి మారుతితో ఓ సినిమా చేయాలని చూస్తున్న రాజు గారు 'శైలజా రెడ్డి అల్లుడు' తర్వాత మారుతి దగ్గర ఈ కథ విన్నాడట.

అయితే సినిమా కథాంశం అటు ఇటుగా 'శతమానం భవతి'కి దగ్గర ఉండటంతో మారుతి కథను రిజెక్ట్ చేసాడట రాజు. నిజానికి దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తే నిజంగానే 'శతమానం భవతి' కంపేరిజన్ వచ్చేది. పైగా రాజు గారు మళ్ళీ అలాంటి కథే ఎందుకు ఎంచుకొని సినిమా నిర్మించారనే చర్చ నడిచేది. ఇవన్నీ గమనించే మారుతికి నో చెప్పి ఉంటాడు దిల్ రాజు. ఇక శతమానం భవతికి సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని ఇది ఇంత వరకూ ఎవరూ చూడని కథ అంటూ చెప్పుకొస్తున్నాడు మారుతి. మరి ఇందులో నిజమెంతో రిలీజ్ తర్వాతే తెలుస్తోంది.