Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ తో దోస్తీ అంటే గిట్లుంటది మరి!
By: Tupaki Desk | 1 Feb 2023 6:00 PM GMTసినిమా ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు పరిచయాలు, దోస్తీలు ఖచ్చితంగా వుండాల్సిందే. లేదంటే ఇక్కడ ఎదగడం చాలా కష్టం. అలా మన కంటూ మనల్ని అక్కున చేర్చుకుని, మన ప్రతిభని గుర్తించి దాన్ని పది మందికి తెలియజేస్తూ అవకాశాలు కల్పించే ఫ్రెండ్స్ వున్నంత కాలం ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవ వుండదు. త్రివిక్రమ్, తమన్ జోడీ ఇప్పుడు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. 'మళ్లీ మళ్లీ' అనే మూవీతో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తమన్ కు శంకర్ నిర్మించిన 'ఈరమ్' మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.
అయితే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం మాస్ మహారాజా రవితేజ 'కిక్' సినిమా. ఈ మూవీతో టాలీవుడ్ లో టాప్ హీరోల దృష్టిలో పడిన తమన్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లని దక్కించుకున్నా సేమ్ ట్యూన్స్ మేకర్ అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా ఇతర భాషలకు చెందిన మ్యూజిక్ ని హ్యాపీగా లేపేస్తాడని తమన్ ట్రోల్ కు గురైన సందర్భాలు కూడా చాలానే వున్నాయి.
అలాంటి తమన్ లోనూ కొత్త తరహా సంగీత దర్శకుడు వున్నాడని, అతని సంగీతాన్ని సరికొత్తగా ఆవిష్కరించి తమన్ కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పిన దర్శకుడు త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఆడియోనే ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి దోస్తీ కుదిరింది. ఆ దోస్తీ వల్లే తమన్ పవన్ నటించిన సినిమాలకు సంగీతం అందించడం మొదలు పెట్టాడు. పవన్ 'వకీల్ సాబ్' తో పాటు ఇటీవల విడుదలైన 'భీమ్లానాయక్' మూవీకి కూడా తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ కారణంగానే పవన్ సినిమాలకు సంగీతం అందించే అవకాశాన్ని దక్కించుకున్న తమన్ కు త్రివిక్రమ్ దోస్తీ వల్ల మరో గోల్డెన్ ఛాన్స్ లభించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ తమన్ కు లభించినట్టుగా తెలుస్తోంది.
త్రివిక్రమ్ దోస్తీ వల్లే తమకు ఈ గోల్డెన్ ఛాన్స్ లభించినట్టుగా చెబుతున్నారు. ముందు ఈ మూవీకి మరో మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకున్నారట. అయితే త్రివిక్రమ్ చొరవ తీసుకోవడంతో ఆ ఛాన్స్ తమన్ ని వరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
అయితే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం మాస్ మహారాజా రవితేజ 'కిక్' సినిమా. ఈ మూవీతో టాలీవుడ్ లో టాప్ హీరోల దృష్టిలో పడిన తమన్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లని దక్కించుకున్నా సేమ్ ట్యూన్స్ మేకర్ అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా ఇతర భాషలకు చెందిన మ్యూజిక్ ని హ్యాపీగా లేపేస్తాడని తమన్ ట్రోల్ కు గురైన సందర్భాలు కూడా చాలానే వున్నాయి.
అలాంటి తమన్ లోనూ కొత్త తరహా సంగీత దర్శకుడు వున్నాడని, అతని సంగీతాన్ని సరికొత్తగా ఆవిష్కరించి తమన్ కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పిన దర్శకుడు త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఆడియోనే ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి దోస్తీ కుదిరింది. ఆ దోస్తీ వల్లే తమన్ పవన్ నటించిన సినిమాలకు సంగీతం అందించడం మొదలు పెట్టాడు. పవన్ 'వకీల్ సాబ్' తో పాటు ఇటీవల విడుదలైన 'భీమ్లానాయక్' మూవీకి కూడా తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ కారణంగానే పవన్ సినిమాలకు సంగీతం అందించే అవకాశాన్ని దక్కించుకున్న తమన్ కు త్రివిక్రమ్ దోస్తీ వల్ల మరో గోల్డెన్ ఛాన్స్ లభించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ తమన్ కు లభించినట్టుగా తెలుస్తోంది.
త్రివిక్రమ్ దోస్తీ వల్లే తమకు ఈ గోల్డెన్ ఛాన్స్ లభించినట్టుగా చెబుతున్నారు. ముందు ఈ మూవీకి మరో మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకున్నారట. అయితే త్రివిక్రమ్ చొరవ తీసుకోవడంతో ఆ ఛాన్స్ తమన్ ని వరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.