Begin typing your search above and press return to search.

మన సినిమాలపై బాలీవుడ్‌ వాళ్లు మరీ ఇంతలా పడ్డారేంటో?

By:  Tupaki Desk   |   11 Aug 2020 11:30 PM GMT
మన సినిమాలపై బాలీవుడ్‌ వాళ్లు మరీ ఇంతలా పడ్డారేంటో?
X
సౌత్‌ సినిమాలకు బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు అంటే అక్కడి వారు చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్‌ లో రీమేక్‌ అయ్యింది అంటే చాలా గొప్ప విషయం. కాని ఇప్పుడు చాలా కామన్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం పది తెలుగు సినిమాల వరకు రీమేక్‌ అవ్వబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రారంభం అవ్వగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. త్వరలో మరిన్ని తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్‌ బాట పట్టే అవకాశం ఉంది.

తెలుగులో 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘వినాయకుడు’ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్‌ కాబోతుంది అంటే ప్రస్తుతం తెలుగు సినిమాలకు బాలీవుడ్‌ వారు ఏ స్థాయిలో మోజు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక సింపుల్‌ చిన్న మూవీ వినాయకుడు. కృష్ణుడు హీరోగా నటించిన ఆ సినిమాలో హీరోయిన్‌ గా సోనియా నటించింది. సాయి కిరణ్‌ అడవి దర్శకత్వంలో వచ్చిన వినాయకుడు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఎమోషనల్‌ గా కట్టి పడేసింది. అందుకే వినాయకుడు సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందట.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో తెలుగు వర్షన్‌ కు దర్శకత్వం వహించిన సాయి కిరణ్‌ అడవి హిందీలో రూపొందించబోతున్నాడు. బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ కమెడియన్‌ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ ఏడాది చివరి వరకు రీమేక్‌ కు సంబంధించిన అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు.