Begin typing your search above and press return to search.

గుండెపోటుతో తమిళ యువ నటుడు మృతి

By:  Tupaki Desk   |   27 March 2020 6:50 AM GMT
గుండెపోటుతో తమిళ యువ నటుడు మృతి
X
తమిళ నటుడు సేతు రామన్ గుండెపోటుతో మృతి చెందాడు. 2013లో వ‌చ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'క‌న్న ల‌డ్డు తిన్నా ఆస‌య్య' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. సేతురామన్ ప్రస్తుత వయస్సు 35 సంవత్సరాలు. ఇంత చిన్న వ‌య‌స్సులో గుండెపోటుతో క‌న్నుమూయడం అందర్నీ కలవరపరుస్తున్నది. వృత్తిరీత్యా చర్మవ్యాధి నిపుణుడు అయిన సేతు తర్వాత రోజుల్లో నటుడిగా మారాడు. కాగా, అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు. తమిళ హాస్యనటుడు హీరో సంతానంతో చాలా స‌న్నిహితంగా ఉంటారు సేతురామ‌న్‌.

వాలిబా రాజా, సక్కా పోడు పోడు రాజా, మరియు 50/50 వంటి త‌మిళ చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆయ‌న మృతి చెందాడ‌నే వార్త త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధించారు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, అభిరామి, కుష్బూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. సేతురామ‌న్‌కి భార్య‌, ఒక బిడ్డ ఉన్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుండే సేతు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేశాడు.