Begin typing your search above and press return to search.
జాతీయ ఉత్తమ నటి పోషించిన పాత్రలో సాహసం?
By: Tupaki Desk | 19 Sep 2020 8:10 AM GMTమూడు జాతీయ అవార్డులు సహా ఫిలింఫేర్ లు..ఐఫా.. జీ అవార్డులు గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది అంధాధున్. ఆయుష్మాన్ ఖురానా .. టబు.. రాధికా ఆప్టే .. ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో జీవించేయడంతో అందరికీ గొప్ప పేరొచ్చింది. అందుకే ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే ఏ హీరో అయితే బావుంటుంది? అన్న చర్చా సాగింది. యూత్ స్టార్ నితిన్ చాలా కాలానికి ఇలాంటి ఓ గొప్ప మూవీని రీమేక్ చేసే ఆలోచనతో ఉన్నారు అనగానే అందరిలో ఆసక్తి మొదలైంది.
ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత అప్ డేట్ ఏమిటి? అంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని నితిన్ భావిస్తున్నారు. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` ఫేం మేర్ల పాక గాంధీ ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. ప్రీప్రొడక్షన్ పక్కాగా సాగుతోంది. ఇక ఇప్పటికే ఇందులో కీలక పాత్రధారులందరినీ ఎంపిక చేసుకున్న సంగతి విధితమే.
`అంధాధున్` కథాంశం ఇంట్రెస్టింగ్. ఇది బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. నటీనటులకు అవార్డులు గెలుచుకునేందుకు ఆస్కారం ఉన్న గొప్ప స్క్రిప్టు కూడా ఇది. అందుకే ప్రధాన పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసారట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కి జాక్ పాట్ తగిలిందని తెలుస్తోంది. ఆసక్తికరంగా టబు పోషించిన పాత్రను మిల్కీ పోషించనుందట. అలాగే రాధిక ఆప్టే చేసిన పాత్రలో నభ నటేష్ ని ఎంపిక చేసుకున్నారట. తమన్నా .. నభా ఇద్దరికీ ఛాలెంజింగ్ ఆఫర్స్ ఇవి అంటూ అంచనా వేస్తున్నారు. ఇక ఏజ్ సహా పరిణతి దృష్ట్యా టబుతో సరితూగేలా తమన్నా నటించగలదా? అన్నది వేచి చూడాలి. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ సమర్పణలో లైట్ హౌస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత అప్ డేట్ ఏమిటి? అంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని నితిన్ భావిస్తున్నారు. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` ఫేం మేర్ల పాక గాంధీ ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. ప్రీప్రొడక్షన్ పక్కాగా సాగుతోంది. ఇక ఇప్పటికే ఇందులో కీలక పాత్రధారులందరినీ ఎంపిక చేసుకున్న సంగతి విధితమే.
`అంధాధున్` కథాంశం ఇంట్రెస్టింగ్. ఇది బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. నటీనటులకు అవార్డులు గెలుచుకునేందుకు ఆస్కారం ఉన్న గొప్ప స్క్రిప్టు కూడా ఇది. అందుకే ప్రధాన పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసారట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కి జాక్ పాట్ తగిలిందని తెలుస్తోంది. ఆసక్తికరంగా టబు పోషించిన పాత్రను మిల్కీ పోషించనుందట. అలాగే రాధిక ఆప్టే చేసిన పాత్రలో నభ నటేష్ ని ఎంపిక చేసుకున్నారట. తమన్నా .. నభా ఇద్దరికీ ఛాలెంజింగ్ ఆఫర్స్ ఇవి అంటూ అంచనా వేస్తున్నారు. ఇక ఏజ్ సహా పరిణతి దృష్ట్యా టబుతో సరితూగేలా తమన్నా నటించగలదా? అన్నది వేచి చూడాలి. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ సమర్పణలో లైట్ హౌస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.