Begin typing your search above and press return to search.

క్యాన్సర్‌ నే జయించింది.. ఇప్పుడు సినిమాను!

By:  Tupaki Desk   |   15 Oct 2021 10:30 AM GMT
క్యాన్సర్‌ నే జయించింది.. ఇప్పుడు సినిమాను!
X
బాలీవుడ్ యంగ్ స్టార్‌ హీరో ఆయుష్మాన్ ఖురానా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. నటుడిగా తనను తాను ప్రతి సినిమాకు మార్చుకుంటూ వెళ్తూ అభిమానుల ఆధరాభిమానంను దక్కించుకుంటున్నాడు. ఆయుష్మాన్ భార్య తాహిరా కశ్యప్‌ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆమె నటిగా కాకుండా దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఫిల్మ్‌ మేకింగ్‌ కొత్తేం కాదు. గతంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్ ను ఆమె తెరకెక్కించారు. ఆ షార్ట్స్ ఫిల్మ్స్‌ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్‌ తో సినిమాను చేస్తోంది.

గతంలో దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండటంతో పాటు రచయితగా కూడా ఆమెకు ప్రావిణ్యం ఉంది. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేయడంతో పాటు రచయితగా పలు సినిమాలకు రచన సహకారం అందించింది. కథలు చెప్పడంలో తాహిర కు మంచి ప్రావిణ్యం ఉంది. అందుకే ఆమె నటిగా కాకుండా దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తుంది. ఇండస్ట్రీలో లేడీ దర్శకులు చాలా తక్కువ. తాహిరా ఆ లోటు తీర్చుతానంటోంది. ప్రస్తుతం తాహిరా సాక్షి తన్వర్‌.. దివ్వా దత్తా.. సయామీ ఖేర్‌ లు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా 'శర్మా జీ కి బేటీ' ను ఖరారు చేశారు.

ఈ సినిమా కథ మొత్తం అమ్మాయిల చుట్టు తిరుగుతుందట. మిడిల్ క్లాస్ అమ్మాయిల ఆశలు.. కోరికలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుత సమాజంపై ఈ సినిమా ఒక సెటైరికల్‌ గా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డ తాహిరా కశ్యప్‌ క్యాన్సర్‌ ను జయించింది. ఇప్పుడు ఆమె సినిమాను జయించేందుకు సిద్దం అయ్యింది. క్యాన్సర్ పై పోరాడి ఘన విజయం సాధించిన తాహిరా కు సినిమా పెద్ద విషయం కాదని.. ఆమె ఈ మొదటి ప్రయత్నంలో విజయం సాధించడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.