Begin typing your search above and press return to search.
తెలుగు టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి..!
By: Tupaki Desk | 9 April 2020 11:50 AM GMTప్రముఖ టీవీ యాంకర్ - సీరియల్ నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందారు. శాంతి అసలు పేరు విశ్వశాంతి. ఈమె ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం శవమై కనిపించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై చుటుపక్కల వాళ్లను విచారిస్తున్నారు. అలాగే ఆమె ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.
శాంతి ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను కూాడా పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. గత 4 రోజులుగా ఇంట్లోంచి ఆమె బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా.
శాంతి ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను కూాడా పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. గత 4 రోజులుగా ఇంట్లోంచి ఆమె బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా.