Begin typing your search above and press return to search.

'#JusticeForSushantRajput బ్రిగేడ్ ఇప్పుడు హ్యాపీనా?'

By:  Tupaki Desk   |   26 Sep 2020 5:39 PM GMT
#JusticeForSushantRajput బ్రిగేడ్ ఇప్పుడు హ్యాపీనా?
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ - శ్రద్ధాకపూర్ లకు నోటీసులు జారీ చేసిన ఎన్సీబీ.. గత రెండు రోజులుగా వారిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్సీబీ ఎదుట హాజరైన సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లు కీలక విషయాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సారా - శ్రద్ధా ఇద్దరూ ఎన్సీబీ విచారణలో తాము సుశాంత్ ఫార్మ్ హౌస్ లో నిర్వహించే పార్టీలకు అటెండ్ అయినట్లు అంగీకరించారని సదరు ఛానల్స్ చెప్పుకొచ్చాయి. అంతేకాకుండా ఈ పార్టీలలో తాము డ్రగ్స్ తీసుకోలేదని.. సుశాంత్ డ్రగ్స్ తీసుకోవడం చూశామని.. షూటింగ్ బ్రేక్ టైంలో సుశాంత్ వ్యానిటీ వ్యాన్ లో డ్రగ్స్ తీసుకునేవాడని విశ్వసనీయ సమాచారం అంటూ ఏబీపీ న్యూస్ ఛానల్ పేర్కొంది. అయితే ఈ న్యూస్ పై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ స్పందించింది. బ్రిగేడ్ ఇప్పుడు హ్యాపీనా అని ట్వీట్ చేసింది.

స్వర భాస్కర్ ట్వీట్ చేస్తూ.. '#JusticeForSushantRajput ట్రెండ్ చేసిన బ్రిగేడ్ ఇప్పుడు హ్యాపీనా? ఈ గ్యాంగ్స్ చివరకు సుశాంత్ ఇమేజ్‌ ను ఈ విధంగా అపఖ్యాతిపాలు చేసారు.. సిగ్గులేని స్కావెంజర్స్' అని పేర్కొంది. నిజానికి రోజులు గడుస్తున్న కొద్దీ సుశాంత్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటాడని.. అతని డ్రగ్ బానిస అన్నట్లు ఈ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకముందు రియా చక్రవర్తి కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా సుశాంత్ తో నటించిన ఇద్దరు హీరోయిన్స్ సారా - శ్రద్ధా లు కూడా అదే విషయాన్ని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కి న్యాయం జరగడం అటుంచి అతని ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన సపోర్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్వర భాస్కర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. కాకపోతే సుశాంత్ కేసుపై మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్న ఫైర్ బ్రాండ్ కంగనా ను ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ చేసిందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.