Begin typing your search above and press return to search.

టాలీవుడ్ క్రేజ్ కోసం పరభాషా స్టార్స్ పాకులాట.. మకాం మార్చుతూ..?

By:  Tupaki Desk   |   18 Jun 2021 3:30 AM GMT
టాలీవుడ్ క్రేజ్ కోసం పరభాషా స్టార్స్ పాకులాట.. మకాం మార్చుతూ..?
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రధానకేంద్రం అయినటువంటి హైదరాబాద్ అందులో ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ లేనప్పుడు సినీతారలంతా చెన్నై లేదా ముంబై వైపు ప్రయాణం మొదలు పెట్టేవారు. అలాగే అవసరమైతే చెన్నై - ముంబై లాంటి ప్రాంతాలలో షూటింగ్స్ కు అనుగుణంగా ఇండస్ట్రీ సమీపంలో సెటిల్ అయ్యేందుకు మకాం మార్చేవారు. ఆ విధంగానే టాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీలకు చెన్నై ముంబైలలో సొంతంగా ఇల్లు.. ఫ్లాట్స్ కొనుగోలు చేసుకొని పెట్టుకున్నారు.

కానీ ఎప్పుడైతే చెన్నై నుండి హైదరాబాద్ కు తెలుగు ఇండస్ట్రీ సెపరేట్ అయిందో.. అప్పటినుండి మెల్లగా సౌత్ తో పాటుగా నార్త్ స్టార్స్.. ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు.. హీరోలు హీరోయిన్స్ హైదరాబాద్ మకాం మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడే సొంతంగా ఇల్లు.. ఫ్లాట్స్ కొనుగోలు చేసుకుని ఆఫీసులు కూడా ఓపెన్ చేస్తున్నారు. అయితే మొన్నటివరకు హైదరాబాద్ కు ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్స్ మకాం మార్చడం చూసాం. కానీ ఇప్పుడు సౌత్ టు నార్త్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు దృష్టిపెడుతూ భాగ్యనగరానికి మకాం మార్చుతున్నారు.

ఆల్రెడీ కన్నడ స్టార్స్.. సుదీప్ - పునీత్ రాజకుమార్ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు. అదేవిధంగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్స్ సూర్య - కార్తీలు కూడా ఎలాగో వారి తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మకాం మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ హీరోలే కాదు. బాలీవుడ్ స్టార్స్ రన్వీర్ సింగ్ - రణబీర్ కపూర్ లాంటి వారు కూడా ప్రస్తుతం సౌత్ పై దృష్టి పెడుతున్నారు. అందుకే హైదరాబాద్ లో కూడా ఇల్లు ఆఫీస్ ఓపెన్ చేసే ప్రణాళికలో ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పటికే ఈ హీరోలు సౌత్ దర్శకులతో వర్క్ చేస్తున్నారు. ఈ లెక్కన అన్ని ఇండస్ట్రీల తారలకు టాలీవుడ్ - హైదరాబాద్ అనేవి సౌత్ లో క్రేజ్ దక్కించుకునేందుకు మెయిన్ పిల్లర్స్ కాబోతున్నాయని టాక్.