Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్స్ తో స్టార్ డైరెక్టర్ సినిమాలు..!

By:  Tupaki Desk   |   15 July 2021 11:30 PM GMT
స్టార్ కిడ్స్ తో స్టార్ డైరెక్టర్ సినిమాలు..!
X
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కమర్షియల్‌ చిత్రాలతో పాటుగా పౌరాణిక, చారిత్రక నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ సెట్స్ - వీఎఫెక్స్ - భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గుణశేఖర్.. అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. స్టార్ హీరోలతో విజయవంతమైన సినిమాలు చేసిన ఈ స్టార్ డైరెక్టర్.. స్టార్ కిడ్స్ తో సినిమా చేయడంలో కూడా ప్రసిద్ధి చెందారు.

'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని లీడ్ రోల్ లో తీసుకొని 'రామాయణం' చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్. ఈ సినిమా జాతీయ చలన చిత్ర అవార్డ్ అందుకోవడమే.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ ఎలిఫాంట్ అవార్డు సాధించింది. ఇక అనుష్క శెట్టి - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రంతో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ - కుమార్తె మేధ లను యాక్టింగ్ డెబ్యూ చేయించారు.

'రుద్రమదేవి' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ''శాకుంతలం'' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న గుణశేఖర్.. ఈ చిత్రంతో అల్లు ఫ్యామిలీ నాలుగో తరాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన ముద్దు ముద్ద మాట‌లతో అల్లరి చేష్ట‌ల‌తో ఆకట్టుకునే అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన అగ్ర దర్శకుడు.. అర్హ తో షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు.

ఇదిలా ఉంటే గుణశేఖర్ తదుపరి ప్రాజెక్ట్ లో మరో స్టార్ కిడ్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అది ఎవరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్. దగ్గుబాటి రానా తో తలపెట్టిన 'హిరణ్యకశ్యప' సినిమాతో అభయ్ ను గుణశేఖర్ లాంచ్ చేయాలని చూస్తున్నారట. తారక్ తో 'బాల రామాయణం' సినిమా చేసిన గుణ శేఖర్.. నందమూరి మూడో తరాన్ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకుంటారో లేదో చూడాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇకపోతే ప్రస్తుతం గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మలయాళ హీరో దేవ్ మోహన్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల - దుష్యంతుడి ఎపిక్ ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత 'హిరణ్యకశ్యప' సినిమాని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు గుణశేఖర్. ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'ప్రతాపరుత్రుడు' అనే హిస్టారికల్ మూవీ చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం.