Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది.. స్టార్ రైటర్ స్టేట్మెంట్..!

By:  Tupaki Desk   |   24 July 2021 3:30 AM GMT
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది.. స్టార్ రైటర్ స్టేట్మెంట్..!
X
ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం టాలీవుడ్ లోని పెద్ద సినిమాలన్నింటికి సంభాషణలు అందిస్తూ బిజీగా ఉన్నారు. 'క్రాక్' చిత్రానికి మాటలు అందించి బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి మాధవ్.. ప్రస్తుతం రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. శంకర్ - రామ్ చరణ్ కాంబోలో రూపొందనున్న '#RC15' చిత్రానికి కూడా ఆయనే సంభాషణలు రాస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కలయికలో వస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాకి కూడా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.

ఇటీవల 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ - చరణ్ స‌న్నివేశాలు, వారి డైలాగ్స్ అదిరిపోతాయని.. గూస్ బంప్స్ గ్యారంటీ అని సాయి మాధవ్ బుర్రా స్టేట్మెంట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు. ఆ త‌రువాత 'శంక‌ర్ - చ‌ర‌ణ్' సినిమా కోసం అద్భుత‌మైన స‌న్నివేశాల‌కి అత్యద్భుమైన డైలాగ్స్ రాస్తున్నా అంటూ మ‌రో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 'హ‌రి హ‌ర వీరమ‌ల్లు' సినిమా విష‌యంలో కూడా స్టార్ రైట‌ర్ ఇలానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప‌వ‌న్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగరేసే విధంగా ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయ‌ని చెబుతున్నాడు. వీరమల్లు సినిమా అత్యద్భుతంగా ఉంటుందని.. మరో లెవెల్ లో ఉంటుందని సాయిమాధవ్ బుర్రా అంటున్నారు.

ఇలా సాయిమాధవ్ వర్క్ చేస్తున్న ప్రతీ పెద్ద సినిమాకి స్టేట్మెంట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇకపోతే రామ్ పోతినేని - లింగు స్వామి కాంబోలో రూపొందుతున్న '#RAPO19' కూడా బుర్రా నే మాటలు రాస్తున్నారు. అలానే బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కలయికలో వచ్చే '#NBK107'.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా సాయి మాధవ్ చేతిలోనే ఉన్నాయి.