Begin typing your search above and press return to search.
సమంత కోసం స్టార్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్
By: Tupaki Desk | 14 Jan 2022 2:07 PM GMTస్టార్ హీరోయిన్ సమంత - హీరో నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకుల ప్రకటన తరువాత కొంత డిప్రెషన్ కి లోనైన సామ్ ఆ తరువాత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసి హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో పాటు క్రేజీ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది. గుణశేఖర్ చారిత్రాత్మక చిత్రం `శాకుంతం` చిత్రీకరణ పూర్తి చేసిన సమంత ఆ వెంటనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్ లో పెట్టేసింది.
`యశోద` పేరుతో సూపర్ నేచురల్ అంశాల నేపథ్యంలో ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా వున్న సామ్ ఇటీవల `పుష్ప`లో ప్రత్యేక గీతం చేసి మరింత పాపులర్ అయింది. ఇదిలా వుంటే సమంత క్రేజ్ని మరింత హైకి చేర్చడానికి భారీ స్కెచ్ ని సిద్ధం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
`అల వైకుంఠపురములో` తరువాత త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. అయితే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అని ప్రకటించారు త్రివిక్రమ్ కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మూవీ అని ప్రకటించారు కానీ ఈ మూవీ స్టార్ట్ కావడానికి మరింత సమయం పట్టేలా వుంది. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట`లో నటిస్తున్నారు. ఇది పూర్తయితే కానీ మరో చిత్రానికి మహేష్ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి.
దీంతో తనకు దొరికిన సమయాన్ని `భీమ్లా నాయక్` కోసం వాడారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ మూవీ కూడా పూర్తయిపోయింది. తనతో సినిమా చేస్తారని ఎదురుచూస్తున్న ఇద్దరు హీరోలు వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటంతో త్రివిక్రమ్ ఫైనల్ గా సమంతని నమ్ముకుంటున్నారట. ఈ మూవీతో సామ్ రేంజ్ ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారట.
గతంలో సామ్, నితిన్ లతో `అఆ` మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్ అదే ఫార్ములాతో సామ్ తో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం ఓ ఫేమస్ నవల హక్కుల్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిందిన అధికారిక ప్రకటనని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
`యశోద` పేరుతో సూపర్ నేచురల్ అంశాల నేపథ్యంలో ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా వున్న సామ్ ఇటీవల `పుష్ప`లో ప్రత్యేక గీతం చేసి మరింత పాపులర్ అయింది. ఇదిలా వుంటే సమంత క్రేజ్ని మరింత హైకి చేర్చడానికి భారీ స్కెచ్ ని సిద్ధం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
`అల వైకుంఠపురములో` తరువాత త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. అయితే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అని ప్రకటించారు త్రివిక్రమ్ కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మూవీ అని ప్రకటించారు కానీ ఈ మూవీ స్టార్ట్ కావడానికి మరింత సమయం పట్టేలా వుంది. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట`లో నటిస్తున్నారు. ఇది పూర్తయితే కానీ మరో చిత్రానికి మహేష్ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి.
దీంతో తనకు దొరికిన సమయాన్ని `భీమ్లా నాయక్` కోసం వాడారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ మూవీ కూడా పూర్తయిపోయింది. తనతో సినిమా చేస్తారని ఎదురుచూస్తున్న ఇద్దరు హీరోలు వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటంతో త్రివిక్రమ్ ఫైనల్ గా సమంతని నమ్ముకుంటున్నారట. ఈ మూవీతో సామ్ రేంజ్ ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారట.
గతంలో సామ్, నితిన్ లతో `అఆ` మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న త్రివిక్రమ్ అదే ఫార్ములాతో సామ్ తో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం ఓ ఫేమస్ నవల హక్కుల్ని సొంతం చేసుకున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిందిన అధికారిక ప్రకటనని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.